ETV Bharat / state

న్యాయం చేయాలంటూ వంటావార్పుతో కార్మికుల నిరసన

విజయనగరం జిల్లా భోగాపురంలో శ్రీనివాస కోళ్ల పరిశ్రమ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఎలాంటి ఉద్యోగ భద్రత కల్పించకుండా పరిశ్రమ మూసేశారంటూ.. ఆందోళన నిర్వహించారు.

author img

By

Published : Oct 5, 2020, 4:13 PM IST

Updated : Oct 6, 2020, 12:41 PM IST

poultry workers protest through vanta varpu program
వంటా-వార్పుతో కార్మికుల నిరసన

విజయనగరం జిల్లా భోగాపురంలో శ్రీనివాస కోళ్ల పరిశ్రమ కార్మికులు వంటావార్పు కార్యక్రమంతో నిరసన వ్యక్తం చేశారు. 15 రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నా యాజమాన్యం మొండివైఖరితో వ్యవహరిస్తోందన్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఊరుకునేదిలేదని తేల్చి చెప్పారు.

నిరసనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. జీతాల బకాయిలు చెల్లించకపోవడం, గ్రాట్యుటీ, పీఎఫ్ ఇవ్వకపోవడంపై ఆందోళన చేశారు. సీఐటీయూ జిల్లా కార్యవర్గ సభ్యులు సూర్యనారాయణ, నర్సింగరావు, సుందర్రావు, త్రినాథరావు పాల్గొన్నారు.

విజయనగరం జిల్లా భోగాపురంలో శ్రీనివాస కోళ్ల పరిశ్రమ కార్మికులు వంటావార్పు కార్యక్రమంతో నిరసన వ్యక్తం చేశారు. 15 రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నా యాజమాన్యం మొండివైఖరితో వ్యవహరిస్తోందన్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఊరుకునేదిలేదని తేల్చి చెప్పారు.

నిరసనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. జీతాల బకాయిలు చెల్లించకపోవడం, గ్రాట్యుటీ, పీఎఫ్ ఇవ్వకపోవడంపై ఆందోళన చేశారు. సీఐటీయూ జిల్లా కార్యవర్గ సభ్యులు సూర్యనారాయణ, నర్సింగరావు, సుందర్రావు, త్రినాథరావు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:

విలేకరిపై దాడి చేసిన ఎస్​ఐపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం

Last Updated : Oct 6, 2020, 12:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.