విజయనగరం జిల్లా గరివిడి పోలీసుస్టేషన్ నుంచి సోము వీర్రాజు తరలించారు. వాహనాల్లోనే పోలీసులు తిప్పుతున్నారు. రామతీర్థంలో దుండగులు ధ్వంసం చేసిన కోదండరాముడి విగ్రహాన్ని చూసేందుకు భాజపా, జనసేన రామతీర్థ ధర్మయాత్ర చేపట్టింది. పోలీసు ఆంక్షల నడుమ సోము వీర్రాజు రామతీర్థం జంక్షన్ చేరుకున్నారు. అక్కడ పోలీసులు, నేతలకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పోలీసులు సోము వీర్రాజును అరెస్టు చేసి గరివిడి పోలీసుస్టేషన్కు తరలించారు. అక్కడి నుంచి వాహనాల్లోనే తిప్పుతున్నారు.
ఇదీ చదవండి: రామతీర్థం జంక్షన్లో ఉద్రిక్తత.. సోము వీర్రాజు అరెస్టు