విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంతోపాటు, బొబ్బిలి, రాయగఢ్ మార్గాల్లో రహదారులు అధ్వానంగా మారడంతో ప్రజలు రాకపోకలకు నిత్యం అవస్థులు పడుతున్నారు. అడుగడుగునా గుంతలు.. కిలోమీటర్ల పరిధిలో తేలిన రాళ్లు వాహన చోదకులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మరోవైపు పట్టణంలో ఏటా వేలల్లో జనాభా పెరుగుతున్నా.. ఆ స్థాయిలో సౌకర్యాలు మెరుగు పడటం లేదు. పట్టణంలో వాహనాలను పార్కింగ్ చేసేందుకు సరైన స్థలం లేక రోడ్లపైనే ఉంచుతున్నారు. దీంతో తీవ్ర ట్రాఫిక్ సమస్యకు దారితీస్తోంది.
కొన్ని నెలలగా పరిస్థితి ఉన్నా రహదారుల నిర్మాణానికి యంత్రాంగం చర్యలు చేపట్టడం లేదు. రాత్రి పూట ఈ మార్గాలో ద్విచక్రవాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. గోతులు పూడ్చి, పట్టణంలో వాహనాలకు పార్కింగ్ స్థలం ఏర్పాటు చేస్తే చాలా మేర ఇబ్బందులు గట్టెక్కుతాయి. ట్రాఫిక్ సమస్యపై ఎస్సై కళాధర్ మాట్లాడుతూ ఆటో చోదకులతో ఇటీవల సమావేశం నిర్వహించామని, ఎక్కడ పడితే అక్కడ నిలపొద్దని సూచించామన్నారు. పార్కింగ్ స్థలాల ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: