విశాఖ జిల్లా కొయ్యూరు మండలం మర్రిపాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద బోలెరో వాహనం బోల్తా పడింది. ధాన్యం లోడుతో ఒడిశా నుంచి నర్సీపట్నం వెళ్తున్న బొలెరో వాహనం మర్రిపాలెం వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. వాహన రాకపోకలకు అంతరాయం కలగకుండా స్థానికులు వాహనంలోని బస్తాలను తొలగించారు.
ఇదీ చదవండి: