ఆపరేషన్ సముద్ర సేతులో భాగంగా మాల్దీవుల నుంచి 698 భారతీయలతో నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ జలాశ్వ బయలు దేరింది. భారతీయలను కొచ్చికి తీసుకువస్తోంది. అక్కడి నుంచి వారంతా... స్వస్ధలాలకు క్వారంటైన్ నిబంధనలకు అనుగుణంగా చేరుకోవాల్సి ఉంటుంది.
యుద్ద నౌకల ద్వారా విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని భారత్ కు తీసుకువచ్చేందుకు భౌతిక దూరం, కరోనా నివారణా పద్దతులను, వ్యాప్తి నిరోధక మార్గదర్శకాలను పాటిస్తున్నారు. విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని ప్రాధాన్య క్రమంలో స్వదేశానికి చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తొలి దశలో గర్భిణులు, బాలింతలు, పిల్లలు, వృద్దులు, మహిళలకు ప్రాధాన్యమిచ్చారు.
ఇదీ చూడండి: