విశాఖ జిల్లా చీడికాడ మండలం కోనాంలో పంచాయతీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. కోనాంకి చెందిన చలుగు అప్పలనాయుడు, చలుగు శ్రీరామ్మూర్తి ఇద్దరూ అన్నదమ్ములు. వీరిలో అప్పలనాయుడు భార్య రెండోసారి సర్పంచి పదవికి పోటీ చేస్తున్నారు. శ్రీరామ్మూర్తి కుమారుడు ప్రసాద్ భార్య ఉషారాణి తొలిసారి సర్పంచ్ పదవికి పోటీచేస్తున్నారు. సర్పంచ్ పదవికి ఒకే కుటుంబం నుంచి అత్తా, కోడలు తలపడటంతో.. ఆసక్తిగా మారింది. ఇరువురు ప్రచారం జోరుగా చేస్తున్నారు. ఈ పంచాయతీ నుంచే.. మూడో అభ్యర్థి చలుగు ఈశ్వరమ్మ సర్పంచి పోటీలో ఉన్నారు.
ఇదీ చదవండి: విశాఖ ఉక్కు పరిశ్రమను విక్రయిస్తే రాష్ట్రమే కొంటుంది: మంత్రి గౌతమ్రెడ్డి