ETV Bharat / state

'మీ వినతులు బాక్సులో వేయండి ప్లీజ్'

author img

By

Published : Jul 21, 2020, 9:52 PM IST

అవి ప్రభుత్వ కార్యాలయాలే... కానీ ప్రజలు రావొద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. కార్యాలయ గేట్లు మూసివేస్తున్నారు. మీకేమైనా సమస్యలు ఉంటే.. వినతి పత్రాలను గేటు ముందున్న బాక్సులో వేసి వెళ్లమంటున్నారు. ఇదంతా ఆ ప్రభుత్వ కార్యాలయ అధికారుల ముందస్తు జాగ్రత్తలు... కరోనా మహమ్మారి బారిన పడకుండా!

mro office gate closes
వినూత్నంగా వినతుల స్వీకరణ
చోడవరం ఎమ్మార్వో కార్యాలయంలో వినూత్నంగా వినతుల స్వీకరణ

విశాఖ జిల్లా చోడవరంలో ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా గేట్లు తాళాలు వేసి... తాళ్లు కట్టి ఉంటున్నాయి. ఇదంతా.. కరోనా వలనే. ఎందుకంటే చోడవరంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో... ప్రభుత్వ ఉద్యోగులు ముందస్తు జాగ్రత్తగా.. ఈ చర్యలు చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద గేటును మూసివేసి అక్కడ ఓ బాక్సును ఏర్పాటు చేశారు. కార్యాలయానికి వచ్చే ఎవరైనా వినతి పత్రాలు ఆ బాక్సులోనే వేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అత్యవసరమైతే తప్ప.. కార్యాలయానికి ఎవరూ రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి: చోడవరంలో పెరుగుతున్న కరోనా కేసులు.... ఆందోళనలో ప్రజలు

చోడవరం ఎమ్మార్వో కార్యాలయంలో వినూత్నంగా వినతుల స్వీకరణ

విశాఖ జిల్లా చోడవరంలో ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా గేట్లు తాళాలు వేసి... తాళ్లు కట్టి ఉంటున్నాయి. ఇదంతా.. కరోనా వలనే. ఎందుకంటే చోడవరంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో... ప్రభుత్వ ఉద్యోగులు ముందస్తు జాగ్రత్తగా.. ఈ చర్యలు చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద గేటును మూసివేసి అక్కడ ఓ బాక్సును ఏర్పాటు చేశారు. కార్యాలయానికి వచ్చే ఎవరైనా వినతి పత్రాలు ఆ బాక్సులోనే వేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అత్యవసరమైతే తప్ప.. కార్యాలయానికి ఎవరూ రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి: చోడవరంలో పెరుగుతున్న కరోనా కేసులు.... ఆందోళనలో ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.