ETV Bharat / state

గుండ్లకమ్మ వాగులో పడి ఇద్దరు మృతి - markapuram gundlakamma lake deaths

ఇంటికి వెళ్తూ.. ప్రమాదవశాత్తు గుండ్లకమ్మ వాగులో పడి ఇద్దరు వ్యక్తులు మరణించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో ఈ ఘటన జరగ్గా.. స్థానికులు వారి మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు.

gundlakamma lake deaths
గుండ్లకమ్మ వాగులో మృతులు
author img

By

Published : Dec 3, 2020, 6:14 PM IST

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గుండ్లకమ్మ వాగులో రెండు మృతదేహాలను స్థానికులు గుర్తించారు. మృతులు ఇరువురూ అదే మండలానికి చెందిన కాటంరాజు, గాలెయ్యలుగా పోలీసులు గుర్తించారు. గత నెల 28 నుంచి వారు కనిపించడం లేదని మార్కాపురం గ్రామీణ పోలీసు స్టేషన్​లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇద్దరు స్నేహితులు ఎక్కడికో వెళ్లి ఉంటారని పోలీసులు భావించారు. 28వ తేదీ రాత్రి ఇంటికి వెళ్తూ.. ప్రమాద వశాత్తు గుండ్లకమ్మ వాగులో పడి మృతి చెందారని అనుమానిస్తున్నారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ కిషోర్ కుమార్ పరిశీలించారు.

ఇదీ చదవండి:

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గుండ్లకమ్మ వాగులో రెండు మృతదేహాలను స్థానికులు గుర్తించారు. మృతులు ఇరువురూ అదే మండలానికి చెందిన కాటంరాజు, గాలెయ్యలుగా పోలీసులు గుర్తించారు. గత నెల 28 నుంచి వారు కనిపించడం లేదని మార్కాపురం గ్రామీణ పోలీసు స్టేషన్​లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇద్దరు స్నేహితులు ఎక్కడికో వెళ్లి ఉంటారని పోలీసులు భావించారు. 28వ తేదీ రాత్రి ఇంటికి వెళ్తూ.. ప్రమాద వశాత్తు గుండ్లకమ్మ వాగులో పడి మృతి చెందారని అనుమానిస్తున్నారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ కిషోర్ కుమార్ పరిశీలించారు.

ఇదీ చదవండి:

పోలీసులమని బెదిరించి.. బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.