మత్స్యకారుల ఉనికి, ఉపాధికి విఘాతం కలిగించే విధంగా తీసుకు వచ్చిన జీవో నెంబరు 217ను వెంటనే రద్దు చేయాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒంగోలులోని ఓ కల్యాణ మండపంలో మత్స్యకార, బీసీ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈనెల 19న నెల్లూరులో 'మత్యకార హోరు' పేరిట ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మత్స్యకారులకు వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు, జీవోలు తీసుకువచ్చారని కొల్లు ఆక్షేపించారు. ఈ వృత్తిలో అనేక మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారని వారందరికీ ఇదే జీవనాధారమని అన్నారు. ఇప్పటికైనా జీవో 217ను వెనక్కి తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇదీ చదవండి :
GO 217 issue: జీవో 217పై దుష్ప్రచారం సరికాదు - మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు