ప్రకాశం జిల్లా కురిచేడుమండలం కల్లూరు, గుట్టమీదపల్లి గ్రామాల్లో కుక్కలు బెడదతో గ్రామస్థులు హడలిపోతున్నారు. రోజు రోజుకీ శునకాల దాడిలో గాయపడుతున్నవారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవటం లేదు. ఇప్పటికే ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకున్న పాపన లేదని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రకాశం జిల్లా కురిచేడుమండలం కల్లూరు, గుట్టమీదపల్లి గ్రామాల్లో పిచ్చి కుక్క స్వైరవిహారం చేయటంతో పలువురు గాయపడ్డారు. ఇద్దరు బాలురులతోపాటుగా వెంకటయ్య అనే వృద్ధుడు గాయపడ్డారు. పిచ్చికుక్క కాటుకు గురైన పిల్లలను.. చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కురిచేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. గ్రామాల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి...