ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వల్లపల్లి సమీపంలో.. ఓ ద్విచక్ర వాహనం అదుపుతప్పి అద్దంకి బ్రాంచ్ కాలువలో పడింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తిని స్థానికులు కాపాడారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతుడు కందుకూరు మండలం కంచరగుంట గ్రామానికి చెందిన శ్రీనివాసరావుగా గుర్తించారు. శ్రీనివాసరావు బల్లికురవ మండలం వేమవరంలోని క్వారీలో పనిచేస్తున్నాడు. స్వగ్రామానికి చెందిన వాసుతో కలిసి పనిచేసే ప్రాంతానికి వస్తూ.. మార్గమధ్యంలో ప్రమాదానికి గురయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: వైకాపా అరాచకాలకు బుద్ధిచెప్పిన జనం: తెదేపా