ETV Bharat / state

ఐడియా అదిరింది... ట్రాఫిక్ ఉల్లంఘిస్తే "సినిమా"నే!

ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే రూ.100 నుంచి ఐదు వందల రూపాయలు ఫైన్ చెల్లిస్తే సరిపోతుంది. కానీ ఈ విధానంలో మార్పు తీసుకొస్తామంటున్నారు నెల్లూరు ట్రాఫిక్ పోలీసులు. రోడ్డుపై నిబంధనలు ఉల్లంఘిస్తే... సినిమా తప్పదంటున్నారు. దీనికోసం ఓ మినీ హాలునే సిద్ధం చేశారు. ఇంతకీ... ఆ సినిమా ఏంటో చూసేద్దామా!

author img

By

Published : Aug 13, 2019, 12:29 PM IST

కౌన్సెలింగ్ సెంటర్లో తల్లిదండ్రులతో పోలీసులు
కౌన్సెలింగ్ సెంటర్లో తల్లిదండ్రులతో పోలీసులు

ట్రాఫిక్ ఉల్లంఘన రాయుళ్లకు సినిమా చూపిస్తామంటున్నారు నెల్లూరు పోలీసులు. ట్రాఫిక్ దిద్దుబాటు చర్యల్లో భాగంగా నగరంలో ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఉల్లంఘనులకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. దీంతో ఓ వినూత్న ప్రయోగానికి తెరదీశారు వారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే, ఎలాంటి ఇబ్బందులు ఎదరవుతాయో తెలిపేలా ఓ విజువల్ ప్రజెంటేషన్ను తయారు చేశారు. అందుకోసం ట్రాఫిక్ పోలీసు స్టేషన్ కౌన్సిలింగ్ సెంటర్లో ఓ మినీ సినిమా హాలును సిద్ధం చేశారు. 20 మంది కూర్చునేలా కుర్చీలు వేసి, సినిమా చూపిస్తున్నారు. అల్పాహారం కూడా వారికి అందిస్తూ... అర్థమయ్యేలా వివరిస్తున్నారు. ముఖ్యంగా యువకులు, ఆటోడ్రైవర్లు. మైనర్లు, తాగి నడిపే వాహనదారులు, ట్రిపుల్ రైడింగ్, సెల్ఫోన్ డ్రైవింగ్ చేసేవారికి ఈ హాల్లో సినిమా చూపిస్తున్నారు. మైనర్ల విషయంలో తల్లిదండ్రులకు సినిమా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యంతో పిల్లల భవిష్యత్ ఎలా దెబ్బతింటుందో తెలియజేస్తున్నారు. ఒక్కొక్కరికి గంట సమయం కేటాయిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలియజేస్తున్నారు.

ఒకసారి కౌన్సిలింగ్కు హాజరై ట్రాఫిక్ ఉల్లంఘన కేసులో మరోసారి దొరికితే.. చర్యల్లో స్థాయిని పెంచుతున్నారు పోలీసులు. ఒకటి, రెండుసార్లు కౌన్సిలింగ్ ఇచ్చాక, మళ్లీ మూడోసారి దొరికితే, లైసెన్స్ను రద్దు చేస్తున్నారు. విద్యార్థుల విషయంలో కౌన్సిలింగ్ కార్యక్రమంలో కళాశాలల ప్రిన్సిపల్స్ సైతం పాల్గొనేలా చేసి, సదరు విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పెనాల్టీ వసూలు చేసే బదులు ప్రజల్లో అవగాహన కల్పించడంతోనే ప్రజల్లో మార్పు వస్తుందని అంటున్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిన పద్ధతిలో గంట నిడివిగల విజువల్స్ చూపిస్తారు. వారి వివరాలను కంప్యూటర్లో నిక్షిప్తం చేయడం ద్వారా ఉల్లఘనులపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: ఆవుల మృతి... సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ నిర్ణయం

కౌన్సెలింగ్ సెంటర్లో తల్లిదండ్రులతో పోలీసులు

ట్రాఫిక్ ఉల్లంఘన రాయుళ్లకు సినిమా చూపిస్తామంటున్నారు నెల్లూరు పోలీసులు. ట్రాఫిక్ దిద్దుబాటు చర్యల్లో భాగంగా నగరంలో ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఉల్లంఘనులకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. దీంతో ఓ వినూత్న ప్రయోగానికి తెరదీశారు వారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే, ఎలాంటి ఇబ్బందులు ఎదరవుతాయో తెలిపేలా ఓ విజువల్ ప్రజెంటేషన్ను తయారు చేశారు. అందుకోసం ట్రాఫిక్ పోలీసు స్టేషన్ కౌన్సిలింగ్ సెంటర్లో ఓ మినీ సినిమా హాలును సిద్ధం చేశారు. 20 మంది కూర్చునేలా కుర్చీలు వేసి, సినిమా చూపిస్తున్నారు. అల్పాహారం కూడా వారికి అందిస్తూ... అర్థమయ్యేలా వివరిస్తున్నారు. ముఖ్యంగా యువకులు, ఆటోడ్రైవర్లు. మైనర్లు, తాగి నడిపే వాహనదారులు, ట్రిపుల్ రైడింగ్, సెల్ఫోన్ డ్రైవింగ్ చేసేవారికి ఈ హాల్లో సినిమా చూపిస్తున్నారు. మైనర్ల విషయంలో తల్లిదండ్రులకు సినిమా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యంతో పిల్లల భవిష్యత్ ఎలా దెబ్బతింటుందో తెలియజేస్తున్నారు. ఒక్కొక్కరికి గంట సమయం కేటాయిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలియజేస్తున్నారు.

ఒకసారి కౌన్సిలింగ్కు హాజరై ట్రాఫిక్ ఉల్లంఘన కేసులో మరోసారి దొరికితే.. చర్యల్లో స్థాయిని పెంచుతున్నారు పోలీసులు. ఒకటి, రెండుసార్లు కౌన్సిలింగ్ ఇచ్చాక, మళ్లీ మూడోసారి దొరికితే, లైసెన్స్ను రద్దు చేస్తున్నారు. విద్యార్థుల విషయంలో కౌన్సిలింగ్ కార్యక్రమంలో కళాశాలల ప్రిన్సిపల్స్ సైతం పాల్గొనేలా చేసి, సదరు విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పెనాల్టీ వసూలు చేసే బదులు ప్రజల్లో అవగాహన కల్పించడంతోనే ప్రజల్లో మార్పు వస్తుందని అంటున్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిన పద్ధతిలో గంట నిడివిగల విజువల్స్ చూపిస్తారు. వారి వివరాలను కంప్యూటర్లో నిక్షిప్తం చేయడం ద్వారా ఉల్లఘనులపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: ఆవుల మృతి... సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ నిర్ణయం

Intro:FILENAME: AP_ONG_31_13_JILLAKU_CHERINA_SAGAR_JALALU_AV_AP10073
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKSHAM

గుంటూరు-ప్రకాశం జిల్లాల తాగు నీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ ప్రదాన కుడి కాలువ కు విడుదల చేసిన నీరు ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించాయి. జిల్లా సరిహద్దు 85/3 మైలు వద్ద 2500 కూసెక్కులు నీరు వస్తుండగా ప్రస్తుతం తాగు నీటి కోసమేనని ప్రకటించిన నేపధ్యం లో ముందుగా చెరువులు నింపనున్నారు.నీరు పక్క దారి పట్టకుండా అధికారులు చర్యలు చేపట్టారు.నోటిఫైడ్, నాన్ నోటిఫైడ్ తాగునీటి చెరువులు నింపేందుకు ఆర్డబ్ల్యూ ఎస్ అధికారులు సన్నద్ధమవుతున్నారు. జిల్లా తాగు నీటి అవసరాల కోసం ఐదు టీ ఎంసీలు మేర నీరు అధికారులు కేటాయించారు.
కృష్ణా నదికి వరద పోటెత్తడం తో సోమవారం సాగర్ అన్ని కర్స్ట్ గేట్స్ ఎత్తి నీటి ని దిగువకు విడుదల చేసారు.దాంతో సాగు నీటి కి డొక ఉండదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ మెరాకు అధికారులు ఏర్పాట్లు లో నిమగ్నమయ్యారు. తాగు నీటి కోటా పూర్తయ్యాక సాగు నీటి కోసం మేజర్లకు విడుదల చేయనున్నట్లు సమాచారం



Body:kit non 749


Conclusion:9390663594
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.