ETV Bharat / state

రెండు బైకులు ఢీ.. తండ్రీకొడుకులతో సహా మహిళ మృతి

Road Accident: పండుగ పూట ఆ గ్రామంలో విషాదం నెలకొంది. రెండు బైక్​లు ఢీకొన్న ఘటనలో తండ్రీకొడుకులతో సహా మహిళ మృతి చెందింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఎన్టీఆర్​ జిల్లా తునికిపాడులో విషాదఛాయలు నెలకొన్నాయి.

author img

By

Published : Oct 23, 2022, 7:10 PM IST

Etv Bharat
Etv Bharat

Accident: ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం తునికిపాడులో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఒకదానితో మరొకటి ఢీకొనటంతో ఈ ప్రమాదం సంభవించింది. ఒక బైక్​పైన కొమ్మినేని శ్రీకాంత్​, అతని కూమారుడు వర్షిత్​తో పాటు మరో వ్యక్తి ఉండగా.. మరో బైక్​పైన గజ్జల నాగలక్ష్మి ఇంకో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వీరు ప్రయాణిస్తున్న బైకులు తునికిపాడు గ్రామ శివారులో ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో కొమ్మినేని శ్రీకాంత్​, వర్షిత్​, గజ్జల నాగలక్ష్మి ప్రాణాలు కొల్పోయారు, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ముగ్గురు ఒకే గ్రామానికి చెందిన వారు కావటంతో గ్రామంలో పండగ పూట విషాదం నెలకొంది.

Accident: ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం తునికిపాడులో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఒకదానితో మరొకటి ఢీకొనటంతో ఈ ప్రమాదం సంభవించింది. ఒక బైక్​పైన కొమ్మినేని శ్రీకాంత్​, అతని కూమారుడు వర్షిత్​తో పాటు మరో వ్యక్తి ఉండగా.. మరో బైక్​పైన గజ్జల నాగలక్ష్మి ఇంకో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వీరు ప్రయాణిస్తున్న బైకులు తునికిపాడు గ్రామ శివారులో ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో కొమ్మినేని శ్రీకాంత్​, వర్షిత్​, గజ్జల నాగలక్ష్మి ప్రాణాలు కొల్పోయారు, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ముగ్గురు ఒకే గ్రామానికి చెందిన వారు కావటంతో గ్రామంలో పండగ పూట విషాదం నెలకొంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.