ETV Bharat / state

'కూరగాయలు కొనాలంటే భయంగా ఉంది'

కూరగాయల ధరలు కొండెక్కి.. దిగిరానంటున్నాయి. 5 వందల రూపాయల నోటు తీసుకుని మార్కెట్‌కు వెళితే... సంచి నిండటం లేదు. వర్షాభావ పరిస్థితుల కారణంగా... ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇది ఇలానే కొనసాగితే... ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

author img

By

Published : Jul 19, 2019, 2:01 PM IST

'కూరగాయలు కొనాలంటే భయంగా ఉంది'
'కూరగాయలు కొనాలంటే భయంగా ఉంది'

ఆకుకూరలు, కూరగాయల ధరలు కర్నూలు జిల్లా ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల కూరగాయల సాగు గణనీయంగా పడిపోవడమే దీనికి ప్రధాన కారణం. జిల్లాలో ఖరీఫ్‌లో కూరగాయల సాగు సుమారు 40 వేల హెక్టార్లు. రబీలో 2 వేల500 ఎకరాల్లో సాగు చేస్తారు. కోడుమూరు, గోనెగండ్ల, ఎమ్మిగనూరు, ఆదోని, డోన్‌, ఆస్పరి, నందికొట్కూరు పరిధిలో కూరగాయలను అధికంగా సాగు చేస్తున్నారు. ఏటా 10 శాతం పెరగాల్సిన సాగు వర్షాభావం వల్ల..... ప్రస్తుతం 3 వేల 400 హెక్టార్లకే పరిమితమైంది.

పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో టమోటా ఎక్కువగా పండిస్తారు. బెండ, బీర, కాకర, క్యారెట్‌, క్యాబేజీ, బంగాళదుంప, మిర్చి లాంటి అన్ని రకాల కూరగాయలనూ జిల్లాలో పండిస్తున్నారు. స్థానిక అవసరాలు తీరగా... మిగిలినవి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో పూర్తిగా సాగు తగ్గిపోవటం వల్ల... పరిస్థితి తారుమారైంది. స్థానిక అవసరాలు తీర్చుకునేందుకే ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకుంటున్నారు. బంగాళదుంప ఆగ్రా నుంచి దిగుమతి చేసుకుంటుండగా.... క్యారెట్‌, బీన్స్‌, బీట్‌రూట్‌ వంటివి బెంగళూరు నుంచి..... ఉల్లి మహారాష్ట్ర, టమోటా మదనపల్లి, పుంగనూరు నుంచి తీసుకొచ్చి మార్కెట్లలో విక్రయిస్తున్నారు.

రైతుల నుంచి కూరగాయలు సాగు పడిపోవడం వల్లే ధరలు పెరిగాయని.... మరో వారం రోజుల్లో అదుపులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని 8 రైతుబజార్లలోనూ అధికారుల పర్యవేక్షణ లేనందున..... దళారులే రాజ్యమేలుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. దీని వల్ల ధరలు మరింత పెరిగాయని వినియోగదారులు వాపోతున్నారు.

'కూరగాయలు కొనాలంటే భయంగా ఉంది'

ఆకుకూరలు, కూరగాయల ధరలు కర్నూలు జిల్లా ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల కూరగాయల సాగు గణనీయంగా పడిపోవడమే దీనికి ప్రధాన కారణం. జిల్లాలో ఖరీఫ్‌లో కూరగాయల సాగు సుమారు 40 వేల హెక్టార్లు. రబీలో 2 వేల500 ఎకరాల్లో సాగు చేస్తారు. కోడుమూరు, గోనెగండ్ల, ఎమ్మిగనూరు, ఆదోని, డోన్‌, ఆస్పరి, నందికొట్కూరు పరిధిలో కూరగాయలను అధికంగా సాగు చేస్తున్నారు. ఏటా 10 శాతం పెరగాల్సిన సాగు వర్షాభావం వల్ల..... ప్రస్తుతం 3 వేల 400 హెక్టార్లకే పరిమితమైంది.

పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో టమోటా ఎక్కువగా పండిస్తారు. బెండ, బీర, కాకర, క్యారెట్‌, క్యాబేజీ, బంగాళదుంప, మిర్చి లాంటి అన్ని రకాల కూరగాయలనూ జిల్లాలో పండిస్తున్నారు. స్థానిక అవసరాలు తీరగా... మిగిలినవి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో పూర్తిగా సాగు తగ్గిపోవటం వల్ల... పరిస్థితి తారుమారైంది. స్థానిక అవసరాలు తీర్చుకునేందుకే ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకుంటున్నారు. బంగాళదుంప ఆగ్రా నుంచి దిగుమతి చేసుకుంటుండగా.... క్యారెట్‌, బీన్స్‌, బీట్‌రూట్‌ వంటివి బెంగళూరు నుంచి..... ఉల్లి మహారాష్ట్ర, టమోటా మదనపల్లి, పుంగనూరు నుంచి తీసుకొచ్చి మార్కెట్లలో విక్రయిస్తున్నారు.

రైతుల నుంచి కూరగాయలు సాగు పడిపోవడం వల్లే ధరలు పెరిగాయని.... మరో వారం రోజుల్లో అదుపులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని 8 రైతుబజార్లలోనూ అధికారుల పర్యవేక్షణ లేనందున..... దళారులే రాజ్యమేలుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. దీని వల్ల ధరలు మరింత పెరిగాయని వినియోగదారులు వాపోతున్నారు.

Intro:Ap_cdp_46_19_polam lo_neetikunta _endadika panta_pkg_Ap10043
వర్షాలు కురవక సాగునీరు అందక రైతులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. ముందుచూపు లేకపోవడం కారణంగా సాగునీటికి అష్ట కష్టాలు ఎదుర్కొంటున్నారు. తీవ్ర వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. బోర్లలో నీరు ఇంకిపోయింది. ఫలితంగా వేసిన పంటను కాపాడుకోలేక వదిలేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అదే ముందుచూపుతో పొలంలో నీటి కుంటలు ఏర్పాటు చేసుకుని ఉంటే సాగునీటి సమస్య కొంతమేరకైనా తీరుతుందని అధికారులు చెబుతున్నారు. రైతులు తమ పొలాల్లో వ్యక్తిగతంగా చిన్న కుంటలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఐదుగురు రైతులు కలిసి ముందుకు వస్తే పెద్ద కుంట ఏర్పాటుకు అవకాశం లభిస్తుంది. రానున్న రోజుల్లో వీటివల్ల సాగునీటి కష్టాలు తీరుతాయని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. ఉద్యాన సమగ్రాభివృద్ధి మిషన్ కింద సహకారం అందిస్తున్నామని, సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
* కడప జిల్లాలో 1,22,310 హెక్టర్లల్లో ఉద్యాన పంటల సాగులో ఉన్నాయి వీటికి సకాలంలో నీటి తడులు అందించి లేకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే ప్రతి రైతు తన పొలంలో ఎక్కడో ఒక చోట చిన్న కుంటాను ఏర్పాటు చేసుకోవాలని ఉద్యాన శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఉద్యాన శాఖ కొలతల ప్రకారం చిన్న నిర్మాణానికి రూ. 1,50,000లు ఖర్చవుతుంది. ఇందులో లో రైతు వాటాగా 75 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. పెద్ద కుంట నిర్మాణానికి 20 లక్షల రూపాయల వ్యయం అవుతుంది. దీనికి పూర్తిగా రాయితీ లభిస్తుంది. అయితే 25 ఎకరాల తక్కువ కాకుండా రైతులు ఉమ్మడిగా ముందుకు వస్తే పెద్ద కుంటలను నిర్మిస్తారు. దీని విస్తీర్ణం 30 వేల క్యూబిక్ మీటర్లు ఉంటుంది.
* పెద్ద కుంటలో సుమారు 30 వేల క్యూబిక్ మీటర్ల నీటి నిల్వ చేసుకోవచ్చు. వర్షాకాలంలో ఇది నిండితే సమీపంలోని బోర్లలో నీటి మట్టం పెరుగుతుంది. వర్షాలు పడిన సమయంలో ఈ కుంటలో నీటిని పొలాలకు అందించు కోవచ్చు. వర్షాలు పడి బోర్లలో నీరు ఉంటే ఆ నీటితో కుంటను నింపుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేక గొట్టాలను ఏర్పాటు చేస్తారు. కుంటకు చుట్టూ భారీ కంచెను నిర్మిస్తారు.
* కడప జిల్లాలో గత ఏడాది నుంచి ఇప్పటి వరకు రైతులు 532 చింతకుంట నుండి నిర్మించుకున్నారు ఇంకా 172 నిరూపించుకోవాల్సి ఉంది ఇప్పటివరకు సుమారు రూ.3,98,25,000లు ఖర్చు చేశారు. ఇక పెద్ద కుంటలు 29 చోట్ల ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఉద్యాన శాఖ 5.8 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కడప జిల్లా రాజంపేట నుంచి రాయచోటి కి వెళ్లే మార్గంలో లో ప్రభాస్ అన్న రైతు ఐదుగురు రైతులతో కలిసి పెద్ద నిర్మించుకున్నారు. వర్షాకాలంలో ఈ కొండను పుట్టామని ఎండాకాలంలో వాటిని సద్వినియోగం చేసుకుంటామని రైతు ప్రభాకర్ తెలియజేశారు.


Body:పొలంలో నీటి కుండ ఎండదిక పంట


Conclusion:
1.ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు రవీంద్రనాథ్ రెడ్డి
2. రైతు ప్రభాకర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.