కరోనా సమయంలో ప్రైవేట్ విద్యాసంస్థలు ఉపాధ్యాయులను ఆదుకోవాలని కర్నూల్లో కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు నినాదాలు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేసినా ఉపాధ్యాయులకు మాత్రం వేతనాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యా సంస్థల నుంచి ఉపాధ్యాయులకు వేతనాలు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇవీ చదవండి: అహోబిలం ఆలయ పూజారికి కరోనా.. ఆలయం మూసివేత