కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు తుంగభద్ర నదిలో జలదీక్ష చేపట్టారు. హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ 94 రోజులుగా న్యాయవాదులు రిలే నిరాహర దీక్షలు చేపట్టినా ప్రభుత్వం స్పందించకపోవడంతో... వారు నదిలో దిగి నిరసన తెలిపారు. జీఎన్ రావు కమిటీ పర్యటన పూర్తైనా... ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హైకోర్టు విషయమై నిర్ణయం తీసుకోకపోవడంపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లోనే కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ మద్దతు తెలపాలని కోరారు.
ఇదీ చదవండి :