ETV Bharat / state

'500 యూనిట్లు దాటితేనే అదనంగా 90 పైసలు'

రాష్ట్రంలో ఏ మాత్రం విద్యుత్ ఛార్జీలు పెరగలేదని ఇంధన శాఖ కార్యదర్శి, ట్రాన్స్​కో సీఎండీ ఎన్. శ్రీకాంత్ స్పష్టం చేశారు. గతంలో మాదిరిగానే ఛార్జీలు ఉన్నాయన్నారు. విద్యుత్ బిల్లుల చెల్లింపుల గడువును జూన్ 15 వరకు పెంచుతున్నామని చెప్పారు.

author img

By

Published : May 14, 2020, 1:54 PM IST

transco cmd conference on   electricity bills in vijayawada
విద్యుత్ ఛార్జీలపై ట్రాన్స్​కో సీఎండీ శ్రీకాంత్ మీడియా సమావేశం

రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు ఏ మాత్రం పెరగలేదని ఇంధన శాఖ కార్యదర్శి, ట్రాన్స్​కో సీఎండీ ఎన్. శ్రీకాంత్ వెల్లడించారు. కొత్త టారిఫ్ ఆర్డర్ ప్రకారం 500 యూనిట్లు దాటితేనే అదనంగా 90 పైసలు పెరిగిందని వివరించారు. ప్రస్తుతం టారిఫ్ ఆర్డరుతో సంబంధం లేకుండా బిల్లింగ్ చేశామనేది అవాస్తవమని చెప్పారు.

వినియోగదారుల బిల్లులకు సంబంధించిన వివరాలన్నీ ఆన్​లైన్​లో ఉంచుతున్నామని అన్నారు. గతేడాది విద్యుత్ టారిఫ్ ఆర్డర్ ఏ విధంగా ఉందో.. ఈ ఆర్థిక సంవత్సరం అదే అమల్లో ఉందని తెలిపారు. విద్యుత్ బిల్లుల విషయంలో ఏమైనా అనుమానాలుంటే 1912కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని అన్నారు.

ఈఆర్సీ ఆమోదించిన తర్వాతే కొత్త టారిఫ్ అమల్లోకి వచ్చిందని ఆయన తెలిపారు. రీ కనెక్షన్ ఫీజు వసూలుపై త్వరలో స్పష్టత ఇస్తామన్నారు. ప్రభుత్వ నిర్ణయం తర్వాత వచ్చే బిల్లులో రీ కనెక్షన్ ఛార్జీలు సర్దుబాటు చేస్తామని తెలిపారు. బిల్లుల చెల్లింపుల గడువును జూన్ నెల 15వ తేదీ వరకు పెంచుతున్నామని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు ఏ మాత్రం పెరగలేదని ఇంధన శాఖ కార్యదర్శి, ట్రాన్స్​కో సీఎండీ ఎన్. శ్రీకాంత్ వెల్లడించారు. కొత్త టారిఫ్ ఆర్డర్ ప్రకారం 500 యూనిట్లు దాటితేనే అదనంగా 90 పైసలు పెరిగిందని వివరించారు. ప్రస్తుతం టారిఫ్ ఆర్డరుతో సంబంధం లేకుండా బిల్లింగ్ చేశామనేది అవాస్తవమని చెప్పారు.

వినియోగదారుల బిల్లులకు సంబంధించిన వివరాలన్నీ ఆన్​లైన్​లో ఉంచుతున్నామని అన్నారు. గతేడాది విద్యుత్ టారిఫ్ ఆర్డర్ ఏ విధంగా ఉందో.. ఈ ఆర్థిక సంవత్సరం అదే అమల్లో ఉందని తెలిపారు. విద్యుత్ బిల్లుల విషయంలో ఏమైనా అనుమానాలుంటే 1912కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని అన్నారు.

ఈఆర్సీ ఆమోదించిన తర్వాతే కొత్త టారిఫ్ అమల్లోకి వచ్చిందని ఆయన తెలిపారు. రీ కనెక్షన్ ఫీజు వసూలుపై త్వరలో స్పష్టత ఇస్తామన్నారు. ప్రభుత్వ నిర్ణయం తర్వాత వచ్చే బిల్లులో రీ కనెక్షన్ ఛార్జీలు సర్దుబాటు చేస్తామని తెలిపారు. బిల్లుల చెల్లింపుల గడువును జూన్ నెల 15వ తేదీ వరకు పెంచుతున్నామని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:

విజయవాడకు నేడు మెుదటి ప్రయాణికుల రైలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.