ETV Bharat / state

హారతులు పట్టి.. పవన్​కు మహిళల స్వాగతం - కృష్ణా జిల్లా రైతులపై వరదల ప్రభావం

కృష్ణా జిల్లాలో జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ పర్యటిస్తున్నారు. నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులను పవన్​ పరామర్శిస్తున్నారు. రైతన్నలు తమ కష్టాలను విన్నవిస్తున్నారు.

pawan kalyan krishna district tour
కృష్ణా జిల్లాలో పవన్​ పర్యటన
author img

By

Published : Dec 28, 2020, 12:51 PM IST

Updated : Dec 28, 2020, 1:24 PM IST

కృష్ణా జిల్లాలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పర్యటన కొనసాగుతోంది. కంకిపాడు - గుడివాడ రహదారి మీదుగా పవన్‌కల్యాణ్‌ ర్యాలీ జరిగింది. మార్గమధ్యలో రైతులను కలుస్తూ సమస్యలు తెలుసుకుంటున్నారు. తుపాను వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించారు. అంగులూరులో పొలాల్లో దిగి నష్టపోయిన రైతుల కష్టాలు పవన్​ కల్యాణ్ విన్నారు.

నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం పెంచాలని పవన్ డిమాండ్ చేస్తున్నారు. పంటనష్టం పరిహారం పెంచాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్​కు వినతిపత్రం ఇవ్వనున్నారు. నందమూరు క్రాస్ రోడ్డు వద్ద మహిళలు పవన్‌కు హారతులు పట్టారు. రైతన్నలు తమ కష్టాలను పవన్ ‌కు వివరించారు. పంటనష్టానికి పరిహారం పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరారు.

కృష్ణా జిల్లాలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పర్యటన కొనసాగుతోంది. కంకిపాడు - గుడివాడ రహదారి మీదుగా పవన్‌కల్యాణ్‌ ర్యాలీ జరిగింది. మార్గమధ్యలో రైతులను కలుస్తూ సమస్యలు తెలుసుకుంటున్నారు. తుపాను వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించారు. అంగులూరులో పొలాల్లో దిగి నష్టపోయిన రైతుల కష్టాలు పవన్​ కల్యాణ్ విన్నారు.

నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం పెంచాలని పవన్ డిమాండ్ చేస్తున్నారు. పంటనష్టం పరిహారం పెంచాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్​కు వినతిపత్రం ఇవ్వనున్నారు. నందమూరు క్రాస్ రోడ్డు వద్ద మహిళలు పవన్‌కు హారతులు పట్టారు. రైతన్నలు తమ కష్టాలను పవన్ ‌కు వివరించారు. పంటనష్టానికి పరిహారం పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరారు.

ఇదీ చదవండి:

'కృష్ణా జిల్లాలో డ్రై రన్ విజయవంతం'

Last Updated : Dec 28, 2020, 1:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.