విజయవాడ నగరంలోని కార్పొరేటర్లు,ఇంఛార్జ్లతో తెదేపా ఎంపీ కేశినేని నాని సమావేశమయ్యారు.డివిజన్ల విభజన, పెంపును సమస్యాత్మకంగా వైకాపా ప్రభుత్వం మార్చేసిందని మండిపడ్డారు. నగర అభివృద్ధిని,జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోకుండా డివిజన్లను విభజించారన్నారు. గ్రామ వాలంటీర్లు సర్వేల్లో ప్రజలను కులాల గురించి అడగడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామన్నారు. అధికారులు ఏ ప్రాతిపదికన డివిజన్లను విభజించారో చెప్పాలని ప్రశ్నించారు. కులాల ప్రాతిపదికన చేసిన డివిజన్లను తెదేపా తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు.
ఇవీ చదవండి