ETV Bharat / state

CHEATING: ఫేస్​బుక్ స్నేహం.. కలుద్దామని దోచుకున్నారు

author img

By

Published : Aug 3, 2021, 7:09 PM IST

ఫేస్ బుక్​లో పరిచయం అయ్యారు... మిత్రుడిలా మాటలు చెప్పారు... స్నేహపూర్వకంగా కలుద్దామని పిలిచారు. ఆపై నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. నగలు, చరవాణి దోచుకున్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలో ఈ ఘటన జరిగింది.

మోసం
cheating

కృష్ణా జిల్లా గన్నవరం ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాలలో 3వ ఏడాది చదువుతున్న కోట శంకర్ అనే వ్యక్తికి ఫేస్​బుక్​లో సంపత్, జితేంద్ర అనే ఇద్దరు వ్యక్తులు పరిచయమయ్యారు. కొద్ది రోజులు స్నేహపూర్వకంగా ఛాటింగ్ చేశారు. ఈ క్రమంలో 30వ తేదీ కలుద్దామని ‌ గన్నవరం ఎయిర్ పోర్ట్ సమీపంలోకి రమ్మన్నారు. అనంతరం అతడిని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి బెదిరించారు.

సీఐ శివాజీ

శంకర్ ఒంటిపైనున్న మూడు కాసుల బంగారు ఉంగ‌రం, సెల్ ఫోన్ దొంగిలించారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కేసరపల్లి సమీపంలో నిందితులను అరెస్ట్ చేశారు. జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు నగదు కోసం దోపిడీ చేశారని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండీ.. GRMB MEETING: అభ్యంతరాలున్న ప్రాజెక్టుల వివరాలు ఇవ్వలేం: ఏపీ ఈఎన్​సీ

కృష్ణా జిల్లా గన్నవరం ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాలలో 3వ ఏడాది చదువుతున్న కోట శంకర్ అనే వ్యక్తికి ఫేస్​బుక్​లో సంపత్, జితేంద్ర అనే ఇద్దరు వ్యక్తులు పరిచయమయ్యారు. కొద్ది రోజులు స్నేహపూర్వకంగా ఛాటింగ్ చేశారు. ఈ క్రమంలో 30వ తేదీ కలుద్దామని ‌ గన్నవరం ఎయిర్ పోర్ట్ సమీపంలోకి రమ్మన్నారు. అనంతరం అతడిని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి బెదిరించారు.

సీఐ శివాజీ

శంకర్ ఒంటిపైనున్న మూడు కాసుల బంగారు ఉంగ‌రం, సెల్ ఫోన్ దొంగిలించారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కేసరపల్లి సమీపంలో నిందితులను అరెస్ట్ చేశారు. జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు నగదు కోసం దోపిడీ చేశారని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండీ.. GRMB MEETING: అభ్యంతరాలున్న ప్రాజెక్టుల వివరాలు ఇవ్వలేం: ఏపీ ఈఎన్​సీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.