విశాఖ ఘటనపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. చంద్రబాబును అడ్డుకోవటం వెనుక వైకాపాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇది రాజకీయ ఆందోళన కాదని... ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశమని అన్నారు. ఎంతో ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాల్లో చంద్రబాబు అరాచకాన్ని ప్రేరేపిస్తున్నారన్న ఆయన.. తెదేపా అధినేత అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అందువల్ల ప్రజలు పర్యటనను అడ్డుకున్నారన్నారు. ఉత్తరాంధ్ర పర్యటన అంటూ పార్టీ నాయకులతో హంగామా సృష్టించే ప్రయత్నం చేశారని విమర్శించారు. రెచ్చగొట్టే వైఖరి వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చంద్రబాబుకు పోలీసులు విజ్ఞప్తి చేసినా ఆయన పట్టించుకోలేదన్నారు. విశాఖలో చంద్రబాబు, తెదేపా నాయకుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి: