ETV Bharat / state

ఆస్తి కోసం తల్లి ప్రాణం తీసిన కుమార్తె

author img

By

Published : Oct 3, 2020, 10:07 AM IST

Updated : Oct 4, 2020, 3:02 AM IST

ఆస్తికోసం కన్న తల్లినే హతమార్చించింది ఓ కూతురు. విజయవాడ అజిత్​ సింగ్​నగర్​లో నివాసం ఉంటున్న సూదాల అన్నామణి అనే వృద్ధురాలని ఆమె కుమార్తె తన కుమారుడితో కలిసి హత్య చేసింది. ఆస్తి కోసం ఈ పనిచేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితురాలని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

An old woman died under suspicious circumstances in Vijayawada
విజయవాడలో ఓ వృద్ధురాలు అనుమానస్పదస్థితిలో మృతి

ఆస్తి కోసం కొడుకుతో కలిసి కన్న తల్లినే హత్యే చేసిందో ఓ కుమార్తె. ఈ ఘటన విజయవాడ నగరం అజిత్‌సింగ్‌నగర్‌లో జరిగింది. సూదాల అన్నామణి అనే వృద్ధురాలు లూనా సెంటర్‌లో నివాసం ఉంటుంది. ఆమెకు రెండు వివాహాలు జరగగా....మొదటి భర్తకు కుమార్తె, రెండో భార్తకు కుమారుడు సంతానం కలిగారు. భర్తకు దూరమైన కుమార్తె, తల్లి వద్దే ఉంటోంది. కుమారుడు ప్రసాద్‌రాజ్‌ కూడా వీళ్లుండే భవనంలోనే నివాసం ఉంటున్నారు. అయితే ఆస్తి పంపకాల విషయంలో తల్లీ కుమార్తెల మధ్య గొడవలు జరుగుతుండేవి.

తల్లిని అడ్డుతొలగించి, సోదరుడిని బెదిరించి ఆస్తి దక్కించుకోవాలన్న ఆలోచనతో కుమార్తె రత్నకుమారి తన కుమారుడు నవీన్‌తో కలిసి పథకం ప్రకారం హత్య చేసింది. శుక్రవారం ఇంట్లో నిద్రిస్తున్న తల్లి ముఖంపై తలగడతో నొక్కి హతమార్చారు. తల్లి మృతదేహాన్ని గమనించిన కుమారుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రత్నకుమారి, ఆమె కుమారుడే అన్నామణిని హతమార్చినట్లు ప్రాథమికంగా నిర్ధరించిన పోలీసులు కుమార్తెను అదుపులోకి తీసుకున్నారు.

ఆస్తి కోసం కొడుకుతో కలిసి కన్న తల్లినే హత్యే చేసిందో ఓ కుమార్తె. ఈ ఘటన విజయవాడ నగరం అజిత్‌సింగ్‌నగర్‌లో జరిగింది. సూదాల అన్నామణి అనే వృద్ధురాలు లూనా సెంటర్‌లో నివాసం ఉంటుంది. ఆమెకు రెండు వివాహాలు జరగగా....మొదటి భర్తకు కుమార్తె, రెండో భార్తకు కుమారుడు సంతానం కలిగారు. భర్తకు దూరమైన కుమార్తె, తల్లి వద్దే ఉంటోంది. కుమారుడు ప్రసాద్‌రాజ్‌ కూడా వీళ్లుండే భవనంలోనే నివాసం ఉంటున్నారు. అయితే ఆస్తి పంపకాల విషయంలో తల్లీ కుమార్తెల మధ్య గొడవలు జరుగుతుండేవి.

తల్లిని అడ్డుతొలగించి, సోదరుడిని బెదిరించి ఆస్తి దక్కించుకోవాలన్న ఆలోచనతో కుమార్తె రత్నకుమారి తన కుమారుడు నవీన్‌తో కలిసి పథకం ప్రకారం హత్య చేసింది. శుక్రవారం ఇంట్లో నిద్రిస్తున్న తల్లి ముఖంపై తలగడతో నొక్కి హతమార్చారు. తల్లి మృతదేహాన్ని గమనించిన కుమారుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రత్నకుమారి, ఆమె కుమారుడే అన్నామణిని హతమార్చినట్లు ప్రాథమికంగా నిర్ధరించిన పోలీసులు కుమార్తెను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి.

విశాఖలో మాజీ ఎంపీ సబ్బంహరి ఇంటి దగ్గర ఉద్రిక్తత

Last Updated : Oct 4, 2020, 3:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.