ETV Bharat / state

మోసపోయానని ఒకరు - పరువు పోతుందని మరొకరు - TWO POLICE DIED IN TELANGANA

తెలంగాణలో ఇద్దరు హెడ్‌ కానిస్టేబుళ్ల బలవన్మరణం - విషం తాగి ఒకరు, ఉరేసుకుని మరొకరు ఆత్మహత్య

Two Police Died in Telangana
Two Police Died in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 30, 2024, 8:34 AM IST

Two Police Died in Telangana : తెలంగాణలోని ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఇది వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆన్‌లైన్‌ మోసంలో రూ. 25 లక్షలు నష్టపోయిన ఓ హెడ్​ కానిస్టేబుల్, భార్య, ఇద్దరు పిల్లలకు విషం తాగించి తానూ తాగాడు. అయినా మరణించకపోవడంతో ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యాపిల్లలను స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. మరో ఘటనలో వివాహేతర సంబంధమన్న నిందారోపణతో ఓ హెచ్‌సీ స్టేషన్‌ ఆవరణలోనే చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

రూ.25 లక్షలు పోగొట్టుకుని : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన బండారి బాలకృష్ణ (34) అదే జిల్లాలోని టీజీఎస్‌పీ 17వ బెటాలియన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. భార్య మానస, 11 సంవత్సరాల్లోపు ఇద్దరు కుమారులు యశ్వంత్, ఆశ్రిత్‌లతో కలిసి సిద్దిపేటలో నివాసం ఉంటున్నారు. శనివారం సాయంత్రం విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన ఆయన ఆందోళనగా కనిపించగా భార్య ఆరా తీసింది. 15 రోజుల కిందట అధిక లాభాల ఆశతో బాలకృష్ణ అప్పులు చేసి మహారాష్ట్రకు చెందిన గుర్తుతెలియని ఓ కంపెనీలో విడతలవారీగా రూ. 25 లక్షలు పెట్టుబడిగా పెట్టాడు.

ఆ తర్వాత కంపెనీ నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాలకృష్ణ ఆందోళనకు లోనయ్యాడు. ఇక అప్పులు తీర్చే మార్గం లేదని, అందరం కలిసి చనిపోదామని భార్యను ఒప్పించాడు. శనివారం రాత్రి టీలో ఎలుకల మందు కలిపి పిల్లలకు తాగించి వారూ తాగారు. అందరూ అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు స్పృహలోకి వచ్చిన బాలకృష్ణ భార్యాపిల్లలు ప్రాణాలతో ఉండడాన్ని గమనించాడు. మరో గదిలోకి వెళ్లిన ఆయన గడియ పెట్టుకొని ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు.

కొద్దిసేపటికి మెలకువ వచ్చిన భార్య సమీపంలోని బంధువులకు ఫోన్‌ చేసింది. వారొచ్చి అందరినీ సిద్దిపేట సర్వజన ఆసుపత్రికి తరలించారు. బాలకృష్ణ అప్పటికే మరణించగా మానస, పిల్లలను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మానస ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని జరిగిన మోసంపై దర్యాప్తు చేస్తామని వన్‌టౌన్‌ సీఐ వాసుదేవరావు పేర్కొన్నారు.

ప్రాణం తీసిన పరిచయం : కొల్చారం పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కాటూరి సాయికుమార్‌ (55) స్టేషన్‌ ఆవరణలోనే ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి ఎస్సై మహ్మద్‌ గౌస్‌ తెలిపిన వివరాలిలు ఈ విధంగా ఉన్నాయి. నర్సాపూర్‌లో నివసిస్తున్న సాయికుమార్‌కు అదే పట్టణానికి చెందిన దివ్య అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఆమెతో పాటు భర్త శివకుమార్, అల్లుడు కిరణ్‌కుమార్‌లు సాయికుమార్‌ను వేధించసాగారు. అడిగినంత డబ్బులివ్వాలని, లేదంటే చంపేస్తామంటూ బెదిరింపులకు గురిచేశారు. దివ్యను సాయికుమార్‌ వేధింపులకు గురిచేస్తున్నాడని ఇటీవల ఎస్పీకి ఫిర్యాదు కూడా చేశారు.

ఈ క్రమంలోనే విషయం తీవ్రంగా మారితే పరువు పోతుందని సాయికుమార్‌ ఆందోళన చెందాడు. శనివారం రాత్రి విధులు నిర్వహించిన ఆయన ఆదివారం ఉదయం వాకింగ్ వెళ్లి టీ తాగి స్టేషన్‌కు వచ్చాడు. కుటుంబ సభ్యులకు ఫోన్‌లో సమాచారం ఇచ్చి, స్టేషన్‌ ఆవరణలో వెనకవైపు ఖాళీగా ఉన్న క్వార్టర్‌ వద్ద చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆయన కోసం గాలించారు. క్వార్టర్‌ వెనుక ఉన్న రోడ్డులో వెళ్తున్న స్థానికులు చెట్టుకు వేలాడుతున్న సాయికుమార్‌ మృతదేహాన్ని చూసి పోలీసులకు తెలిపారు. ఆయన భార్య శైలజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై మహ్మద్‌ గౌస్‌ పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్​లోని బాపట్ల జిల్లా రేపల్లె ప్రాంతానికి చెందిన సాయికుమార్‌ కుటుంబం దశాబ్దాల కిందటే నర్సాపూర్‌లో స్థిరపడింది. 1992 బ్యాచ్‌కు చెందిన సాయికుమార్‌ సంవత్సరం కిందట కౌడిపల్లి పోలీస్‌స్టేషన్‌ నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఈయనకు భార్యతో పాటు పెళ్లయిన ఇద్దరు కుమార్తెలున్నారు. మూడు రోజుల కిందట కామారెడ్డి జిల్లాలో మృతిచెందిన ఎస్సై సాయికుమార్‌ది కూడా కొల్చారం గ్రామం కావడం, ఇదే ఊరిలో మరో పోలీసు ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశమవుతోంది.

రాత్రి వేళ ఒక్కొక్కరుగా పొలానికి - అనుమానంతో వెళ్లి చూసిన గ్రామస్థులు షాక్

దాని గురించే వాట్సాప్​లో చాటింగ్ - కామారెడ్డి ఘటనలో వీడని మిస్టరీ

Two Police Died in Telangana : తెలంగాణలోని ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఇది వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆన్‌లైన్‌ మోసంలో రూ. 25 లక్షలు నష్టపోయిన ఓ హెడ్​ కానిస్టేబుల్, భార్య, ఇద్దరు పిల్లలకు విషం తాగించి తానూ తాగాడు. అయినా మరణించకపోవడంతో ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యాపిల్లలను స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. మరో ఘటనలో వివాహేతర సంబంధమన్న నిందారోపణతో ఓ హెచ్‌సీ స్టేషన్‌ ఆవరణలోనే చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

రూ.25 లక్షలు పోగొట్టుకుని : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన బండారి బాలకృష్ణ (34) అదే జిల్లాలోని టీజీఎస్‌పీ 17వ బెటాలియన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. భార్య మానస, 11 సంవత్సరాల్లోపు ఇద్దరు కుమారులు యశ్వంత్, ఆశ్రిత్‌లతో కలిసి సిద్దిపేటలో నివాసం ఉంటున్నారు. శనివారం సాయంత్రం విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన ఆయన ఆందోళనగా కనిపించగా భార్య ఆరా తీసింది. 15 రోజుల కిందట అధిక లాభాల ఆశతో బాలకృష్ణ అప్పులు చేసి మహారాష్ట్రకు చెందిన గుర్తుతెలియని ఓ కంపెనీలో విడతలవారీగా రూ. 25 లక్షలు పెట్టుబడిగా పెట్టాడు.

ఆ తర్వాత కంపెనీ నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాలకృష్ణ ఆందోళనకు లోనయ్యాడు. ఇక అప్పులు తీర్చే మార్గం లేదని, అందరం కలిసి చనిపోదామని భార్యను ఒప్పించాడు. శనివారం రాత్రి టీలో ఎలుకల మందు కలిపి పిల్లలకు తాగించి వారూ తాగారు. అందరూ అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు స్పృహలోకి వచ్చిన బాలకృష్ణ భార్యాపిల్లలు ప్రాణాలతో ఉండడాన్ని గమనించాడు. మరో గదిలోకి వెళ్లిన ఆయన గడియ పెట్టుకొని ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు.

కొద్దిసేపటికి మెలకువ వచ్చిన భార్య సమీపంలోని బంధువులకు ఫోన్‌ చేసింది. వారొచ్చి అందరినీ సిద్దిపేట సర్వజన ఆసుపత్రికి తరలించారు. బాలకృష్ణ అప్పటికే మరణించగా మానస, పిల్లలను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మానస ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని జరిగిన మోసంపై దర్యాప్తు చేస్తామని వన్‌టౌన్‌ సీఐ వాసుదేవరావు పేర్కొన్నారు.

ప్రాణం తీసిన పరిచయం : కొల్చారం పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కాటూరి సాయికుమార్‌ (55) స్టేషన్‌ ఆవరణలోనే ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి ఎస్సై మహ్మద్‌ గౌస్‌ తెలిపిన వివరాలిలు ఈ విధంగా ఉన్నాయి. నర్సాపూర్‌లో నివసిస్తున్న సాయికుమార్‌కు అదే పట్టణానికి చెందిన దివ్య అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఆమెతో పాటు భర్త శివకుమార్, అల్లుడు కిరణ్‌కుమార్‌లు సాయికుమార్‌ను వేధించసాగారు. అడిగినంత డబ్బులివ్వాలని, లేదంటే చంపేస్తామంటూ బెదిరింపులకు గురిచేశారు. దివ్యను సాయికుమార్‌ వేధింపులకు గురిచేస్తున్నాడని ఇటీవల ఎస్పీకి ఫిర్యాదు కూడా చేశారు.

ఈ క్రమంలోనే విషయం తీవ్రంగా మారితే పరువు పోతుందని సాయికుమార్‌ ఆందోళన చెందాడు. శనివారం రాత్రి విధులు నిర్వహించిన ఆయన ఆదివారం ఉదయం వాకింగ్ వెళ్లి టీ తాగి స్టేషన్‌కు వచ్చాడు. కుటుంబ సభ్యులకు ఫోన్‌లో సమాచారం ఇచ్చి, స్టేషన్‌ ఆవరణలో వెనకవైపు ఖాళీగా ఉన్న క్వార్టర్‌ వద్ద చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆయన కోసం గాలించారు. క్వార్టర్‌ వెనుక ఉన్న రోడ్డులో వెళ్తున్న స్థానికులు చెట్టుకు వేలాడుతున్న సాయికుమార్‌ మృతదేహాన్ని చూసి పోలీసులకు తెలిపారు. ఆయన భార్య శైలజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై మహ్మద్‌ గౌస్‌ పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్​లోని బాపట్ల జిల్లా రేపల్లె ప్రాంతానికి చెందిన సాయికుమార్‌ కుటుంబం దశాబ్దాల కిందటే నర్సాపూర్‌లో స్థిరపడింది. 1992 బ్యాచ్‌కు చెందిన సాయికుమార్‌ సంవత్సరం కిందట కౌడిపల్లి పోలీస్‌స్టేషన్‌ నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఈయనకు భార్యతో పాటు పెళ్లయిన ఇద్దరు కుమార్తెలున్నారు. మూడు రోజుల కిందట కామారెడ్డి జిల్లాలో మృతిచెందిన ఎస్సై సాయికుమార్‌ది కూడా కొల్చారం గ్రామం కావడం, ఇదే ఊరిలో మరో పోలీసు ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశమవుతోంది.

రాత్రి వేళ ఒక్కొక్కరుగా పొలానికి - అనుమానంతో వెళ్లి చూసిన గ్రామస్థులు షాక్

దాని గురించే వాట్సాప్​లో చాటింగ్ - కామారెడ్డి ఘటనలో వీడని మిస్టరీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.