ETV Bharat / state

'అత్యాచారానికి పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలి' - girl raped news in narasaraopet news updates

గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఇటీవల అత్యాచారానికి గురైన బాలిక తల్లిదండ్రులను మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. కేసును విరమించుకోవాలని నిందితులు బెదిరిస్తున్నారని బాదితులు ఆమె ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వారికి ధైర్యం చెప్పారు.

women-welfare-chairman
author img

By

Published : Oct 25, 2019, 3:52 PM IST

అత్యాచారానికి పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలి

ఇటీవల గుంటూరు జిల్లా నరసరావుపేటలో అత్యాచారానికి గురైన బాలిక తల్లిదండ్రులను మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. కేసును విరమించుకోవాలని నిందితుల తరఫు వాళ్లు బెదిరిస్తున్నారని బాలిక తల్లిదండ్రులు వాసిరెడ్డి పద్మతో మొరపెట్టుకున్నారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ఆమె వారికి ధైర్యం చెప్పారు. చిన్నారులపై అత్యాచారానికి పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.

అత్యాచారానికి పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలి

ఇటీవల గుంటూరు జిల్లా నరసరావుపేటలో అత్యాచారానికి గురైన బాలిక తల్లిదండ్రులను మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. కేసును విరమించుకోవాలని నిందితుల తరఫు వాళ్లు బెదిరిస్తున్నారని బాలిక తల్లిదండ్రులు వాసిరెడ్డి పద్మతో మొరపెట్టుకున్నారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ఆమె వారికి ధైర్యం చెప్పారు. చిన్నారులపై అత్యాచారానికి పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇదీ చూడండి:

వారెవ్వా.. బావిలోపడిన గజరాజును రక్షించిన స్థానికులు

Intro:ap_gnt_81_25_athyachaaraniki_guraina_mainar_balika_nu_parmarsinchina_mahila_kameetion_chairman_avb_ap10170

అత్యాచారానికి గురైన మైనర్ బాలిక తల్లిదండ్రులను పరామర్శించిన మహిళా కమీషన్ చైర్మన్.

ఇటీవల దాచేపల్లి మండలం పెదగార్లపాడు లో అత్యాచారానికి గురైన మైనర్ బాలిక తల్లిదండ్రులను నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో శుక్రవారం రాష్ట్ర మహిళా కమీషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ కలిసి పరామర్శించారు.


Body:మైనర్ బాలిక కు అందిస్తున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు తెలిపారు. అనంతరం బాలిక తల్లితో ఆమె మాట్లాడారు. నిందితుల తరపు వాళ్ళు తమని కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్నారని బాలిక తల్లి మహిళా కమీషన్ చైర్మన్ కు తెలిపింది.


Conclusion:మేమంతా ఉన్నాం మీరు ఎవరికీ భయపడవలసిన అవసరం లేదని వాసిరెడ్డి పద్మ బాలిక తల్లికి భరోసానిచ్చింది. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలో బాలికలపై అఘాయిత్యాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. వీటిపై ప్రభుత్వం, పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టేలా సిఫార్సు చేస్తామని తెలిపారు. ముఖ్యంగా పల్లె గ్రామాలలో ఆడుకునే చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే నిందితులను కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా, గ్రామాల్లో బాలికల రక్షణ ఆయా గ్రామాల వాలెంటర్ల కు అప్పగించేలా కలెక్టర్ ను కలిసి కొరతామన్నారు.

బైట్: వాసిరెడ్డి పద్మ, రాష్ట్ర మహిళా కమీషన్ చైర్మన్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.