ETV Bharat / state

తెలంగాణ: కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత - latest news on MLA Sayanna passed away

MLA Sayanna passed away:
ఎమ్మెల్యే సాయన్న
author img

By

Published : Feb 19, 2023, 4:05 PM IST

Updated : Feb 19, 2023, 8:35 PM IST

15:32 February 19

సికింద్రాబాద్​లోని కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న (72) కన్నుమూత

కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల నేతల దిగ్భ్రాంతి

Cantonment MLA Sayanna passed away: తెలంగాణలోని సికింద్రాబాద్​లోని కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న(72) కన్నుముశారు. గత కొంతకాలంగా గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఎమ్మెల్యే సాయన్న ఈనెల 16న గుండెనొప్పితో యశోద ఆస్పత్రిలో చేరారు. సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సాయన్న భౌతికకాయాన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి తరలించారు.

ఐదుసార్లు ఎమ్మెల్యేగా: ఎమ్మెల్యే జి.సాయన్న బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ చేశారు. తన రాజకీయ జీవితాన్ని టీడీపీ నుంచి ప్రారంభించారు. సాయన్న కంటోన్మెంట్ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1994, 1999, 2004, 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 2018లో టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. సాయన్న హుడా డైరెక్టర్‌గా ఆరుసార్లు బాధ్యతలు నిర్వర్తించారు. 2015లో తితిదే పాలకమండలి సభ్యుడిగా కొనసాగారు. వీధిబాలలకు పునరావాసంపై హౌస్‌ కమిటీ ఛైర్మన్‌గా చేసిన విధులు నిర్వర్తించారు.

సీఎం కేసీఆర్‌ సంతాపం: ఎమ్మెల్యే సాయన్న మరణం పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి అరుదైన ఘనత సాధించారని సీఎం వెల్లడించారు. వివిధ పదవుల ద్వారా సాయన్న చేసిన ప్రజాసేవ చిరస్మరణీయం అని కేసీఆర్ అన్నారు. సాయన్న కుటుంబసభ్యులకు ప్రగాఢసానుభూతి తెలిపారు.

కిషన్‌రెడ్డి సంతాపం: ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సాయన్న అందరితో ఆత్మీయంగా మాట్లాడేవారని వెల్లడించారు. ఆయన కుటుంబ సభ్యులకు కిషన్‌రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

చంద్రబాబు సంతాపం: ఎమ్మెల్యే సాయన్న మృతికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సంతాపం తెలిపారు. సాయన్న హఠాన్మరణం బాధకు గురిచేసిందని ఆయన వెల్లడించారు. ప్రజాసేవలో ఎప్పుడూ సాయన్న ముందుండేవారని చంద్రబాబు పేర్కొన్నారు. సాయన్న కుటుంబసభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

నారా లోకేశ్: ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. టీడీపీతో దశాబ్దాలుగా అనుబంధం ఉన్న నేత.. సాయన్న అని లోకేశ్‌ వెల్లడించారు. రాజకీయ జీవితంలో వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు లోకేశ్‌ గుర్తు చేశారు.

కేటీఆర్: ఎమ్మెల్యే సాయన్న మృతిపట్ల మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.

ఈటల రాజేందర్‌ : ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల ఈటల రాజేందర్‌ సంతాపం తెలిపారు. ఎమ్మెల్యే సాయన్న మరణం చాలా బాధాకరమని వెల్లడించారు. సాయన్న కుటుంబసభ్యులకు దేవుడు మనోధైర్యం ప్రసాదించాలని వెల్లడించారు.

మంత్రి నిరంజన్‌రెడ్డి: ఎమ్మెల్యే సాయన్న మృతిపట్ల మంత్రి నిరంజన్‌రెడ్డి సంతాపం తెలిపారు. సాయన్న కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకున్నారు.

మంత్రి పువ్వాడ అజయ్: ఎమ్మెల్యే సాయన్న మృతిపట్ల మంత్రి పువ్వాడ సంతాపం తెలిపారు. 5సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు సాయన్నకు ఉందని వెల్లడించారు. ఎప్పుడూ ప్రజలతో మమేకమై సమస్యలు పరిష్కరించేవారని పువ్వాడ అజయ్ పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

15:32 February 19

సికింద్రాబాద్​లోని కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న (72) కన్నుమూత

కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల నేతల దిగ్భ్రాంతి

Cantonment MLA Sayanna passed away: తెలంగాణలోని సికింద్రాబాద్​లోని కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న(72) కన్నుముశారు. గత కొంతకాలంగా గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఎమ్మెల్యే సాయన్న ఈనెల 16న గుండెనొప్పితో యశోద ఆస్పత్రిలో చేరారు. సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సాయన్న భౌతికకాయాన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి తరలించారు.

ఐదుసార్లు ఎమ్మెల్యేగా: ఎమ్మెల్యే జి.సాయన్న బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ చేశారు. తన రాజకీయ జీవితాన్ని టీడీపీ నుంచి ప్రారంభించారు. సాయన్న కంటోన్మెంట్ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1994, 1999, 2004, 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 2018లో టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. సాయన్న హుడా డైరెక్టర్‌గా ఆరుసార్లు బాధ్యతలు నిర్వర్తించారు. 2015లో తితిదే పాలకమండలి సభ్యుడిగా కొనసాగారు. వీధిబాలలకు పునరావాసంపై హౌస్‌ కమిటీ ఛైర్మన్‌గా చేసిన విధులు నిర్వర్తించారు.

సీఎం కేసీఆర్‌ సంతాపం: ఎమ్మెల్యే సాయన్న మరణం పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి అరుదైన ఘనత సాధించారని సీఎం వెల్లడించారు. వివిధ పదవుల ద్వారా సాయన్న చేసిన ప్రజాసేవ చిరస్మరణీయం అని కేసీఆర్ అన్నారు. సాయన్న కుటుంబసభ్యులకు ప్రగాఢసానుభూతి తెలిపారు.

కిషన్‌రెడ్డి సంతాపం: ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సాయన్న అందరితో ఆత్మీయంగా మాట్లాడేవారని వెల్లడించారు. ఆయన కుటుంబ సభ్యులకు కిషన్‌రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

చంద్రబాబు సంతాపం: ఎమ్మెల్యే సాయన్న మృతికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సంతాపం తెలిపారు. సాయన్న హఠాన్మరణం బాధకు గురిచేసిందని ఆయన వెల్లడించారు. ప్రజాసేవలో ఎప్పుడూ సాయన్న ముందుండేవారని చంద్రబాబు పేర్కొన్నారు. సాయన్న కుటుంబసభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

నారా లోకేశ్: ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. టీడీపీతో దశాబ్దాలుగా అనుబంధం ఉన్న నేత.. సాయన్న అని లోకేశ్‌ వెల్లడించారు. రాజకీయ జీవితంలో వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు లోకేశ్‌ గుర్తు చేశారు.

కేటీఆర్: ఎమ్మెల్యే సాయన్న మృతిపట్ల మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.

ఈటల రాజేందర్‌ : ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల ఈటల రాజేందర్‌ సంతాపం తెలిపారు. ఎమ్మెల్యే సాయన్న మరణం చాలా బాధాకరమని వెల్లడించారు. సాయన్న కుటుంబసభ్యులకు దేవుడు మనోధైర్యం ప్రసాదించాలని వెల్లడించారు.

మంత్రి నిరంజన్‌రెడ్డి: ఎమ్మెల్యే సాయన్న మృతిపట్ల మంత్రి నిరంజన్‌రెడ్డి సంతాపం తెలిపారు. సాయన్న కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకున్నారు.

మంత్రి పువ్వాడ అజయ్: ఎమ్మెల్యే సాయన్న మృతిపట్ల మంత్రి పువ్వాడ సంతాపం తెలిపారు. 5సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు సాయన్నకు ఉందని వెల్లడించారు. ఎప్పుడూ ప్రజలతో మమేకమై సమస్యలు పరిష్కరించేవారని పువ్వాడ అజయ్ పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 19, 2023, 8:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.