ETV Bharat / state

జిల్లాలో 635 కరోనా కేసులు నమోదు... ఆరుగురు మృత్యువాత

author img

By

Published : Aug 30, 2020, 12:38 AM IST

గుంటూరులో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 635 పాజిటివ్​ కేసులు నమోదవ్వగా... 6 మంది కొవిడ్​ బారిన పడి మృత్యువాతపడ్డారు.

guntur district latest covid news
గుంటూరు జిల్లాలో 635 కరోనా కేసులు నమోదు

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. శనివారం విడుదల చేసిన బులిటెన్​లో తాజాగా 635 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి జిల్లాల్లో వీటి సంఖ్య 36,289కు చేరుకుంది. కాగా ఇప్పటి వరకు కరోనా నుంచి 26,740 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. జిల్లాలో శనివారం కొత్తగా 6 మరణాలు సంభవించాయి. వీటితో కలిపి జిల్లాలో ప్రస్తుతం కొవిడ్​ మరణాల సంఖ్య 365కు చేరుకుంది.

కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరు నగరంలోనే 142 ఉన్నాయి. ఇక మండలాల వారీగా చూస్తే నూజండ్ల-48, మంగళగిరి-47, పెదకూరపాడు-43, బాపట్ల-42, మాచర్ల-40, నరసరావుపేట-36, నాదెండ్ల-23, కర్లపాలెం-22, వినుకొండ-17, అమర్తలూరు-13, ఫిరంగిపురం-11, దాచేపల్లి-10, బొల్లాపల్లి-10 చొప్పున కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మిగతా మండలాల్లో 85 కేసులు వచ్చాయని తెలిపారు.

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. శనివారం విడుదల చేసిన బులిటెన్​లో తాజాగా 635 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి జిల్లాల్లో వీటి సంఖ్య 36,289కు చేరుకుంది. కాగా ఇప్పటి వరకు కరోనా నుంచి 26,740 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. జిల్లాలో శనివారం కొత్తగా 6 మరణాలు సంభవించాయి. వీటితో కలిపి జిల్లాలో ప్రస్తుతం కొవిడ్​ మరణాల సంఖ్య 365కు చేరుకుంది.

కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరు నగరంలోనే 142 ఉన్నాయి. ఇక మండలాల వారీగా చూస్తే నూజండ్ల-48, మంగళగిరి-47, పెదకూరపాడు-43, బాపట్ల-42, మాచర్ల-40, నరసరావుపేట-36, నాదెండ్ల-23, కర్లపాలెం-22, వినుకొండ-17, అమర్తలూరు-13, ఫిరంగిపురం-11, దాచేపల్లి-10, బొల్లాపల్లి-10 చొప్పున కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మిగతా మండలాల్లో 85 కేసులు వచ్చాయని తెలిపారు.

ఇదీ చదవండి :

అనంతపురం జిల్లాలో మరో 933 మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.