ETV Bharat / state

రెడ్ జోన్​ ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

గుంటూరులోని రెడ్ జోన్‌ ప్రాంతాల్లో కేంద్ర వైద్య నిపుణుల బృందం పర్యటించింది. వైరస్ వ్యాప్తి తీరును వారికి కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, అధికారులు వివరించారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి నిరోధానికి వైద్య బృందం సూచనలు ఇచ్చింది.

author img

By

Published : May 9, 2020, 11:49 PM IST

central team visits containment zones in guntur
central team visits containment zones in guntur

గుంటూరులో కరోనా కేసుల వ్యాప్తిని పరిశీలించేందుకు ఇద్దరు సభ్యుల వైద్య నిపుణుల బృందం కరోనా కంటైన్మెంట్ జోన్లలో పర్యటించింది. డాక్టర్ బాబీ పాల్, నందినీ భట్టాచార్య గుంటూరులోని రెడ్ జోన్ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్, డీఐజీ, గుంటూరు అర్భన్ ఇన్​ఛార్జి ఎస్పీ రామకృష్ణ... కరోనా వ్యాపించిన విధానాన్ని, వైరస్ వ్యాప్తి నిరోధానికి జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలను కేంద్ర బృందానికి వివరించారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో కోరోనా వైరస్ వ్యాపించకుండా చేపట్టాల్సిన చర్యలను వైద్యబృందం సూచించింది. ఆదివారం నరసరావుపేటలో ఇద్దరు సభ్యుల కేంద్రబృందం పర్యటించే అవకాశముంది.

ఇదీ చదవండి

గుంటూరులో కరోనా కేసుల వ్యాప్తిని పరిశీలించేందుకు ఇద్దరు సభ్యుల వైద్య నిపుణుల బృందం కరోనా కంటైన్మెంట్ జోన్లలో పర్యటించింది. డాక్టర్ బాబీ పాల్, నందినీ భట్టాచార్య గుంటూరులోని రెడ్ జోన్ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్, డీఐజీ, గుంటూరు అర్భన్ ఇన్​ఛార్జి ఎస్పీ రామకృష్ణ... కరోనా వ్యాపించిన విధానాన్ని, వైరస్ వ్యాప్తి నిరోధానికి జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలను కేంద్ర బృందానికి వివరించారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో కోరోనా వైరస్ వ్యాపించకుండా చేపట్టాల్సిన చర్యలను వైద్యబృందం సూచించింది. ఆదివారం నరసరావుపేటలో ఇద్దరు సభ్యుల కేంద్రబృందం పర్యటించే అవకాశముంది.

ఇదీ చదవండి

రాష్ట్రంలో లాక్‌డౌన్ నుంచి మరికొన్ని వెసులుబాట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.