తమిళనాడులో రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహం కూల్చివేతపై చిత్తూరు జిల్లా మదనపల్లెలో దళిత సంఘాల నాయకులు నిరసన తెలిపారు. మాల మహానాడు ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యమల సుదర్శన్ కోరారు.
ఇదీ చూడండి: మంచినీటి కోసం దయ్యాలగుంట మహిళలు ధర్నా