ETV Bharat / state

డ్రైవర్​ నిద్రమత్తులో రెండు లారీలు ఢీ.. ఇద్దరికి గాయాలు

author img

By

Published : Jul 4, 2021, 11:36 AM IST

ఓ లారీ డ్రైవర్ నిద్రమత్తు కారణంగా అనంతపురంలోని 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. నగరంలోని బళ్లారి రోడ్డు ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు.

o lorries collided at Anantapur
రెండు లారీలు ఢీ

అనంతపురం నగర శివారులో 44వ జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొన్నాయి. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. బళ్లారి రోడ్డు ఫ్లై ఓవర్ వద్ద లారీని నగరంలోంచి బయటకు వెళ్తున్న మరో లారీ ఢీ కొట్టింది. ఈ క్రమంలో అదపు తప్పిన ఓ లారీ.. పక్కనే ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లింది. అయితే ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు.

డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన వాహనాలు హరియాణా, తమిళనాడుకు చెందినవిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

అనంతపురం నగర శివారులో 44వ జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొన్నాయి. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. బళ్లారి రోడ్డు ఫ్లై ఓవర్ వద్ద లారీని నగరంలోంచి బయటకు వెళ్తున్న మరో లారీ ఢీ కొట్టింది. ఈ క్రమంలో అదపు తప్పిన ఓ లారీ.. పక్కనే ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లింది. అయితే ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు.

డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన వాహనాలు హరియాణా, తమిళనాడుకు చెందినవిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి..

ROAD ACCIDENTS: వేర్వేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.