ETV Bharat / state

అనంతలో.. దేవుడికీ తప్పని కరవు కష్టాలు

​​​​​​​అనంతలో కరవు ప్రభావం... గణేష్‌ నిమజ్జనంపైనా పడింది. గంగమ్మ ఒడికి తరలి వెళ్లేందుకు సిద్ధమైన వినాయకుడిని... నీటి కరవు ఇబ్బంది పెడుతోంది. ఏటా వినాయక చవితి నాటికి తుంగభద్ర, హెచ్.ఎల్.సీ, హంద్రీనీవా నుంచి కాలువలకు నీరొచ్చేది. ఈసారి వర్షాభావంతో జలాశయాల్లో నీటి చేరిక ఆలస్యమైంది. ఫలితంగా... నిమజ్జనానికి నీరు అందించేందుకు అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు.

author img

By

Published : Sep 5, 2019, 5:26 PM IST

ganesh

తీవ్ర వర్షాభావం, కరవు కష్టాలు రైతులకే కాదు.. దేవుడికీ తప్పడం లేదు. అనంతపురం జిల్లాలో వర్షాభావంతో చాలా గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో గణేష్‌ నిమజ్జన వేడుక.. అధికారులకు, భక్తులకు కష్టాలు తెచ్చి పెడుతోంది. ఏటా గణనాథులను అనంతపురం నుంచి ప్రవహించే హెచ్.ఎల్.సీ.. కాలువలో నిమజ్జనం చేయటం ఆనవాయితీ. ఈసారి వర్షాలు ఆలస్యం కావడం వల్ల హెచ్.ఎల్.సీలో నీటి కొరత ఏర్పడింది. నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ప్రవహించే హంద్రీనీవా కాలువలో విగ్రహాలను నిమజ్జనం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆత్మకూరు మండలంలోని పంపనూరు వద్ద ప్రవహించే హంద్రీనీవా కాలువకు నీటి ప్రవాహాన్ని పెంచేందుకు జలవనరులశాఖ అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. నగరంలోని విగ్రహాలన్నీ పంపనూరు వద్ద నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెప్పారు.

అనంతలో.. దేవుడికీ తప్పని కరవు కష్టాలు

ఏకంగా 20కిలోమీటర్ల మేర శోభాయాత్ర జరగనుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. జిల్లాలోని పలుచోట్ల నుంచి డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, 600 మందికి పైగా పోలీసులతో భద్రత పర్యవేక్షిస్తున్నారు. నిమజ్జనానికి ముందు నిర్వహించే శోభాయాత్రలో 50 వేల మందికి పైగా పాల్గొంటారని పోలీసులు అంచనా వేశారు. ఈ దిశగా అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

తీవ్ర వర్షాభావం, కరవు కష్టాలు రైతులకే కాదు.. దేవుడికీ తప్పడం లేదు. అనంతపురం జిల్లాలో వర్షాభావంతో చాలా గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో గణేష్‌ నిమజ్జన వేడుక.. అధికారులకు, భక్తులకు కష్టాలు తెచ్చి పెడుతోంది. ఏటా గణనాథులను అనంతపురం నుంచి ప్రవహించే హెచ్.ఎల్.సీ.. కాలువలో నిమజ్జనం చేయటం ఆనవాయితీ. ఈసారి వర్షాలు ఆలస్యం కావడం వల్ల హెచ్.ఎల్.సీలో నీటి కొరత ఏర్పడింది. నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ప్రవహించే హంద్రీనీవా కాలువలో విగ్రహాలను నిమజ్జనం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆత్మకూరు మండలంలోని పంపనూరు వద్ద ప్రవహించే హంద్రీనీవా కాలువకు నీటి ప్రవాహాన్ని పెంచేందుకు జలవనరులశాఖ అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. నగరంలోని విగ్రహాలన్నీ పంపనూరు వద్ద నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెప్పారు.

అనంతలో.. దేవుడికీ తప్పని కరవు కష్టాలు

ఏకంగా 20కిలోమీటర్ల మేర శోభాయాత్ర జరగనుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. జిల్లాలోని పలుచోట్ల నుంచి డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, 600 మందికి పైగా పోలీసులతో భద్రత పర్యవేక్షిస్తున్నారు. నిమజ్జనానికి ముందు నిర్వహించే శోభాయాత్రలో 50 వేల మందికి పైగా పాల్గొంటారని పోలీసులు అంచనా వేశారు. ఈ దిశగా అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

Intro:యాంకర్ తెలుగుదేశం హయాంలోనే నిజమైన తుగ్లక్ పాలన కొనసాగిందని విశాఖ జిల్లా నర్సీపట్నం శాసనసభ్యులు ఉమాశంకర్ గణేష్ పేర్కొన్నారు నర్సీపట్నం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గణేష్ తీవ్రంగా స్పందించారు దొడ్డిదారిలో మంత్రి పదవి సంపాదించిన లోకేష్ కు రాష్ట్ర పాలన పై ఎలాంటి అవగాహన ఉందని ప్రశ్నించారు అంగన్వాడీ కార్యకర్తలు వారిపై అనుచితంగా ప్రవర్తించిన తెలుగుదేశం పాలనలోని ఆయన పేర్కొన్నారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సోదరుడు సన్యాసి పాత్రుడు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన క్రమంలో వైయస్సార్ పార్టీ లోకి వస్తే స్థానిక నాయకులు అధిష్ఠానంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు అయ్యన్నపాత్రుడు 36 ఏళ్ల రాజకీయం లో నర్సీపట్నం ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణా నివారించడంలో విఫలమయ్యారు తాము అధికారంలోకి వచ్చి కేవలం మూడు మూడు నెలల అయినప్పటికీ తమ పార్టీలో గంజాయి స్మగ్లర్లు ఉన్నారని పేర్కొన్నాడు హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే గణేష్ స్పష్టం చేశారు


Body:NARSIPATNAM


Conclusion:8008574736

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.