ETV Bharat / state

స్నేహలత హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణం: మంద కృష్ణ

స్నేహలత హత్య ఘటనలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మాదిగ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. పోలీసులు సమయానికి స్పందించి ఉంటే ఆమె ప్రాణాలు కోల్పోయేది కాదన్నారు.

author img

By

Published : Dec 26, 2020, 5:17 PM IST

స్నేహలత హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణం
స్నేహలత హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణం
స్నేహలత హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణం

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్నేహలత హత్య ఘటనలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మాదిగ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. తమకు ప్రాణహాని ఉందని బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.

అన్ని రాజకీయ పార్టీల నేతలతో కలిసి ఇవాళ ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. హత్య వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు ముందుగా స్పందించి ఉంటే స్నేహలత ప్రాణాలు కోల్పోయేది కాదని అభిప్రాయపడ్డారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై బాధిత కుటుంబ సభ్యులతో కలసి ఎస్పీని కలుస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:

స్నేహలత హత్య ఘటనపై పోలీసుల ముమ్మర దర్యాప్తు

స్నేహలత హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణం

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్నేహలత హత్య ఘటనలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మాదిగ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. తమకు ప్రాణహాని ఉందని బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.

అన్ని రాజకీయ పార్టీల నేతలతో కలిసి ఇవాళ ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. హత్య వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు ముందుగా స్పందించి ఉంటే స్నేహలత ప్రాణాలు కోల్పోయేది కాదని అభిప్రాయపడ్డారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై బాధిత కుటుంబ సభ్యులతో కలసి ఎస్పీని కలుస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:

స్నేహలత హత్య ఘటనపై పోలీసుల ముమ్మర దర్యాప్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.