రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్నేహలత హత్య ఘటనలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మాదిగ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. తమకు ప్రాణహాని ఉందని బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.
అన్ని రాజకీయ పార్టీల నేతలతో కలిసి ఇవాళ ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. హత్య వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు ముందుగా స్పందించి ఉంటే స్నేహలత ప్రాణాలు కోల్పోయేది కాదని అభిప్రాయపడ్డారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై బాధిత కుటుంబ సభ్యులతో కలసి ఎస్పీని కలుస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: