- సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి జగన్ సర్కార్ మరో ప్రణాళిక..
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి జగన్ సర్కారు రూపొందించిన.. తొలి ప్రణాళికలేవీ ఫలించలేదు. వాటికి అవసరమైన నిధుల్లో 25 శాతం కూడా వెచ్చించకపోవడంతో పూర్తిగా పడకేశాయి. ఇప్పుడు పాత ప్రణాళికలను పక్కనబెట్టి.. ప్రభుత్వం కొత్త ఆలోచనలు చేస్తోంది. ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులను విభజించి, ఎంతమేర నిధులు అవసరమో సమాచారం సేకరిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై మాట తప్పిన వైసీపీ సర్కార్
రెగ్యులరైజ్ చేయాల్సిన ఒప్పంద ఉద్యోగుల సంఖ్య తగ్గించేందుకు.. ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎన్నికల ముందు వీలైనంత ఎక్కువ మందిని క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చిన జగన్.. ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మొత్తం 60 వేల మంది పనిచేస్తుండగా.. 10వేల మందిని క్రమబద్ధీకరించి చేతులు దులిపేసుకోవాలని భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఉగ్రవాద పార్టీకి సజ్జల సలహాదారు: పవన్ కల్యాణ్
ఇప్పటం గ్రామంలో జనసేన మద్దతుదారుల ఇళ్లను పడగొట్టిన వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేదాకా నిద్రపోనని పవన్ కల్యాణ్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తానంటూ సవాల్ విసిరారు. ఇప్పుడు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్న వారందరికీ.. 2024లో అధికారంలోకి వచ్చాక గట్టిగా జవాబు చెబుతామని హెచ్చరించారు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని జనసేన అధినేత పవన్కల్యాణ్ ఆరోపించారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసిన పవన్.. చెట్లు నరికేవాళ్లు గరుడ పురాణం చదవాలన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'బాలకృష్ణ సినిమాలో పాటతో ఎంతో గుర్తింపు వచ్చింది'
వీర సింహారెడ్డి చిత్రంలో జై బాలయ్య పాటను పాడిన గాయకుడు కరీముల్లాను కర్నూలు జిల్లా బాలకృష్ణ అభిమానులు సన్మానించారు. బాలకృష్ణ సినిమాలో పాట పాడటం వల్ల తనకెంతో గుర్తింపు వచ్చిందని ఆయన అన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 3500 మంది రైతులకు శిక్షణ.. 200 రకాల విత్తనాల ఉత్పత్తి.. అందుకే 'ఆమె'కు పద్మశ్రీ!
అక్షరం ముక్క రాదు.. ఆస్తులు అంతకన్నా లేవు అయితేనేం.. ఆమె నింపిన స్ఫూర్తి.. వేలమందిని సేంద్రియ సాగు బాటలో నడిపిస్తోంది. దేశవాళీ విత్తనాల భవిష్యత్తుకి భరోసా కల్పిస్తోంది. అందుకే రాహీబాయి సోమ్ పోపెరేకు పద్మశ్రీ ఇచ్చి సత్కరించింది భారత ప్రభుత్వం. ఆమె విజయ ప్రస్థానాన్ని ఓ సారి తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రూ.500 తీసుకొని.. రూ.20గా చూపించి రైల్వే ఉద్యోగి చేతివాటం.. చివరకు..
Railway Employee Cheating : ప్రయాణికుడికి రూ.500 టోకరా పెట్టేందుకు ప్రయత్నించాడు ఓ రైల్వే టికెట్ బుకింగ్ క్లర్క్. అనుకోని విధంగా చివరకు బుక్కయ్యాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అణ్యాయుధ ప్రయోగాలపై కిమ్ కీలక వ్యాఖ్యలు.. అదే తమ అంతిమ లక్ష్యం అంటూ...
Kim Jong Un On Nuclear Weapons : అణ్వాయుధ ప్రయోగాలపై ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అణ్వాయుధ సామర్థ్యాన్ని కలిగి ఉండటమే ఉత్తర కొరియా అంతిమ లక్ష్యమని ఆయన అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మీ గోళ్లు ఇలా మారితే చాలా డేంజర్.. ఆ వ్యాధులు వచ్చే ప్రమాదం!
సాధారణంగా వైద్యులు కళ్లను చూసి శరీర ఆరోగ్య పరిస్థితుల గురించి చెబుతుంటారు. అయితే గోళ్లను చూసి కూడా ఆరోగ్యస్థితిని అంచనా వేయొచ్చట! అనారోగ్యం కారణంగా శరీరంలో వచ్చే మార్పులను మన గోళ్లు ప్రతిబింబిస్తాయట. గోర్ల రంగును బట్టి అనారోగ్యాన్ని తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో తెలుసుకుందామా? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'వన్డే ప్రపంచకప్ గురించి అస్సలు ఆలోచించడం లేదు.. వర్షాలు చికాకు తెప్పిస్తున్నాయి'
2023 వన్డే ప్రపంచకప్ గురించి ఆలోచించడం లేదని, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని జట్టుకు సహకారం అందించడంపై తృష్టి సారించానని టీమ్ఇండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ పేర్కొన్నాడు. వర్షాలు మ్యాచ్లను ప్రభావితం చేయడం ఇరుజట్ల ఆటగాళ్లకు, డబ్బులు చెల్లించే అభిమానులకు చికాకు తెప్పిస్తుందని అన్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వాణి నీ వయ్యారాలు చూస్తే గుండె జారి గల్లంతయ్యిందే
ఆహా కళ్యాణం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది వాణీ కపూర్. దక్షిణాది కంటే బాలీవుడ్లోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫొటోలు పెడుతూ నెటిజన్లను ఆకర్షిస్తోంది. తాజాగా ఈ భామ కొత్త ఫొటోలను పోస్ట్ చేసింది. వాటికి కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. మీరు కూడా ఆ ఫోటోలపై ఓ లుక్కేయండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.