Ind Vs Wi Odi 2023 Schedule : ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్ సమీపిస్తున్న వేళ.. టీమ్ఇండియా ప్రయోగాలు చేయడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. విండీస్తో జరిగిన మొదటి మ్యాచ్లో.. పూర్తిగా బ్యాటింగ్ ఆర్డర్ను మార్చి అతి కష్టం మీద గట్టెక్కింది టీమ్ఇండియా. ఇక రెండో వన్డేలో కీలక ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండానే జట్టు బరిలోకి దిగింది. మ్యాచ్కు ముందు ఈ నిర్ణయాన్ని కొంతమంది సమర్దించినా.. మొదటి ఇన్నింగ్స్ తర్వాత ఈ ప్రయోగం ఫలితం అందర్నీ నిరాశపర్చింది.
అయితే యంగ్ ప్లేయర్లకు ఎక్కువ అవకాశాలు కల్పించేందుకే ఈ ప్రయత్నం చేశామని కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపారు. గతంలో కూడా టీమ్ఇండియా కీలక సమయంలో ఇలాంటి ప్రయోగాలు చేసి విఫలమయ్యింది. ఇప్పుడు మళ్లీ అదే విధానాన్ని అనుసరిస్తున్న బీసీసీఐపై సదరు క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
2022 T20 World Cup : గతేడాది భారత్ ఆడిన పలు సిరీస్లకు టీమ్ఇండియా ఒక్కో జట్టుతో బరిలోకి దిగింది. ఇలా చేయడం వల్ల స్టార్ ఆటగాళ్లపై పడే ఒత్తిడిని తగ్గించవచ్చని మేనేజ్మెంట్ భావించింది. కానీ ఈ ప్రయోగం వల్ల 2022 ఆసియా కప్, 2022 టీ20 ప్రపంచకప్లో భారత్కు నిరాశే మిగిలింది.
ఈసారైనా.. ఇక భారత్ 2013లో ఐసీసీ (ఛాంపియన్స్ ట్రోఫీ) ట్రోఫీ నెగ్గింది. ఆ తర్వాత జరిగిన ఐసీసీ ఈవెంట్లో ఏ ఒక్కదాంట్లో కూడా భారత్ టైటిల్ సాధించలేదు. ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత మళ్లీ వన్డే ప్రపంచకప్నకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ మెగా టోర్నీలో భారత్ హాట్ ఫేవరెట్గా బరిలో దిగనుంది.
మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీలకు ఇదే చివరి వరల్డ్ కప్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మేనేజ్మెంట్.. ఎలాంటి ఉపయోగం లేని ప్రయోగాలు చేయకూడదని బీసీసీఐకు విన్నవిస్తున్నారు ఫ్యాన్స్. స్టార్ బ్యాటర్లు విరాట్, రోహిత్ను జట్టులో ఆడిస్తూ.. మెగాటోర్నీల్లో ఆడే ప్లేయర్లను ఆడిస్తే వారికీ తగిన ప్రాక్టీస్ దొరుకుతుందని పలువురు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.