ETV Bharat / sports

Ind vs Eng: 'ఇలాంటి టెస్ట్​ సిరీస్​లకు ఏదీ సాటి రాదు'

author img

By

Published : Sep 6, 2021, 10:25 AM IST

ప్రస్తుతం జరుగుతున్న సిరీస్​లో ఇంగ్లాండ్​-టీమ్​ఇండియా(ind vs eng) అద్భుతంగా ఆడుతున్నాయని ప్రశంసించాడు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ. పోటాపోటీగా సాగే ఇలాంటి టెస్ట్​ సిరీస్​లకు ఏదీ సాటి రాదని అన్నాడు.

dada
దాదా

టీమ్​ఇండియా-ఇంగ్లాండ్(team india england tour) మధ్య జరు​గుతున్న సిరీస్​లో ఇరు జట్ల పోరాట తీరు చూసి ముగ్ధుడయ్యాడు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ. గతంలోనూ ఇరు జట్లు మైదానంలో గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించాయని అన్నాడు. ఈ సిరీస్​కు ముందు ఆస్ట్రేలియా-టీమ్​ఇండియా మధ్య ఉత్కంఠంగా జరిగిన సిరీస్​ను గుర్తుచేసుకున్నాడు.​ రసవత్తరంగా సాగే ఇలాంటి టెస్ట్​ సిరీస్​లకు మించి ఇంకొకటి ఉండదని అన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్​లో భారత జట్టు అద్భత ప్రదర్శన చేస్తోంది. ఈ నేపథ్యంలోనే టీమ్​ఇండియాను ప్రశంసిస్తూ ఇలా అన్నాడు దాదా.

"ఇది ఉత్తమమైన క్రికెట్. పోటాపోటీగా సాగే ఇలాంటి టెస్టు సిరీస్​కు ఏదీ సాటి రాదు. ఇది వరకు ఆస్ట్రేలియాలో.. ఇప్పుడు ఇక్కడ. అత్యంత నైపుణ్యమైన క్రికెట్ ఇది"

-గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు.

నాలుగో టెస్టు​ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్​లో ​77/0 పరుగులు చేసింది. విజయానికి ఆ జట్టు మరో 291 పరుగులు దూరంలో ఉంది. ఇక తొలి ఇన్నింగ్స్​లో 191 పరుగులకు ఆలౌట్​ అయిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్​లో 466 రన్స్​ చేసింది. ఇంగ్లాండ్​ తొలి ఇన్నింగ్స్​లో 290 పరుగులు చేసింది. మొత్తంగా ఐదు మ్యాచ్​లతో కూడిన సిరీస్​లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి.

ఈ సిరీస్​కు ముందు ఆస్ట్రేలియాలో(teamindia australia series) ఆడిన టెస్టు సిరీస్​లో చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది టీమ్​ఇండియా. 2-1తేడాతో సిరీస్​ను సొంతం చేసుకుంది.

ఇదీ చూడండి: గోడను బాది, హెల్మెట్​ విసిరి కోహ్లీ ఫ్రస్ట్రేషన్

టీమ్​ఇండియా-ఇంగ్లాండ్(team india england tour) మధ్య జరు​గుతున్న సిరీస్​లో ఇరు జట్ల పోరాట తీరు చూసి ముగ్ధుడయ్యాడు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ. గతంలోనూ ఇరు జట్లు మైదానంలో గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించాయని అన్నాడు. ఈ సిరీస్​కు ముందు ఆస్ట్రేలియా-టీమ్​ఇండియా మధ్య ఉత్కంఠంగా జరిగిన సిరీస్​ను గుర్తుచేసుకున్నాడు.​ రసవత్తరంగా సాగే ఇలాంటి టెస్ట్​ సిరీస్​లకు మించి ఇంకొకటి ఉండదని అన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్​లో భారత జట్టు అద్భత ప్రదర్శన చేస్తోంది. ఈ నేపథ్యంలోనే టీమ్​ఇండియాను ప్రశంసిస్తూ ఇలా అన్నాడు దాదా.

"ఇది ఉత్తమమైన క్రికెట్. పోటాపోటీగా సాగే ఇలాంటి టెస్టు సిరీస్​కు ఏదీ సాటి రాదు. ఇది వరకు ఆస్ట్రేలియాలో.. ఇప్పుడు ఇక్కడ. అత్యంత నైపుణ్యమైన క్రికెట్ ఇది"

-గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు.

నాలుగో టెస్టు​ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్​లో ​77/0 పరుగులు చేసింది. విజయానికి ఆ జట్టు మరో 291 పరుగులు దూరంలో ఉంది. ఇక తొలి ఇన్నింగ్స్​లో 191 పరుగులకు ఆలౌట్​ అయిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్​లో 466 రన్స్​ చేసింది. ఇంగ్లాండ్​ తొలి ఇన్నింగ్స్​లో 290 పరుగులు చేసింది. మొత్తంగా ఐదు మ్యాచ్​లతో కూడిన సిరీస్​లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి.

ఈ సిరీస్​కు ముందు ఆస్ట్రేలియాలో(teamindia australia series) ఆడిన టెస్టు సిరీస్​లో చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది టీమ్​ఇండియా. 2-1తేడాతో సిరీస్​ను సొంతం చేసుకుంది.

ఇదీ చూడండి: గోడను బాది, హెల్మెట్​ విసిరి కోహ్లీ ఫ్రస్ట్రేషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.