ETV Bharat / sitara

సోషల్​మీడియాలో 'పాతాళ్​లోక్​' వివాదం

author img

By

Published : May 19, 2020, 9:30 AM IST

బాలీవుడ్ నటి అనుష్క శర్మ నిర్మాణంలో రూపొందిన 'పాతాళ్​లోక్' వెబ్​సిరీస్​పై సామాజిక మాధ్యమాల్లో వివాదం చెలరేగుతోంది. తమ సామాజిక వర్గాలను కించపరిచినట్లు కొంతమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కథ పరంగా ఈ సిరీస్​ అద్భుతంగా ఉందని పలువురు విశ్లేషకులు అంటున్నారు.

Paatal Lok under fire, netizens demand apology from Anushka Sharma
సోషల్​మీడియాలో 'పాతాళ్​లోక్​' వివాదం

బాలీవుడ్​ నటి అనుష్క శర్మ నిర్మాణంలో తెరకెక్కిన తొలి వెబ్​ సిరీస్​ 'పాతాళ్​లోక్​'. థ్రిల్లర్​ జోనర్​లో​ తెరకెక్కిన ఈ సిరీస్​ మార్చి 15న విడుదలైంది. అమెజాన్​ ప్రైమ్​లో తొమ్మిది భాగాలుగా విడుదలైన ఈ సిరీస్​ సామాజిక మాధ్యమాల్లో విశేషాదరణ దక్కించుకుంది. విమర్శకులు దీన్ని ప్రశంసిస్తుండగా.. కొన్ని సామాజిక-రాజకీయ వర్గాలు మాత్రం భిన్నగళాలు వినిపిస్తున్నాయి.

'పాతాళ్​లోక్'​ విడుదలైన తర్వాత ట్విట్టర్​లో ప్రేక్షకులు విభిన్న అభిప్రాయాలతో స్పందించారు. కొన్ని సన్నివేశాలపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అందులో ఓ మహిళా పోలీసు ఒక యువతిని కొట్టి సామాజిక అభ్యంతరకరమైన భాషలో పిలిచినప్పుడు అది ప్రేక్షకుల మనోభావాలను దెబ్బతీసిందని.. చిత్రబృందం ఆ భాగాన్ని సెన్సార్​ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Paatal Lok under fire, netizens demand apology from Anushka Sharma
సోషల్​మీడియాలో 'పాతాళ్​లోక్​' వివాదం

కొన్ని సన్నివేశాలు హిందువులను కించపరిచే విధంగా ఉన్నాయని వాటికి ముందుస్తు విజ్ఞప్తి లాంటివి ఏవీ లేవని కొంతమంది అసహనం వ్యక్తం చేశారు. ప్రైమ్​ను హిందూ వ్యతిరేకని పలువురు నెటిజన్లు అభివర్ణించారు. ఇలాంటి వివాదాల మధ్య కూడా ఈ వెబ్​సిరీస్​ ప్రశంసలు దక్కించుకుంటోంది.

తరుణ్​ తేజ్​పాల్​ రచించిన నవల ఆధారంగా 'పాతాళ్​లోక్​' తెరకెక్కింది. దర్శకుడు సుదీప్​ శర్మ సస్పెన్స్​, థ్రిల్లింగ్​తో పాటు పౌరాణిక అంశాలను కలిపి కథగా రాసుకున్నాడు.

ఇదీ చూడండి.. 'అన్నీ మారాయి.. కానీ మేం మాత్రం'

బాలీవుడ్​ నటి అనుష్క శర్మ నిర్మాణంలో తెరకెక్కిన తొలి వెబ్​ సిరీస్​ 'పాతాళ్​లోక్​'. థ్రిల్లర్​ జోనర్​లో​ తెరకెక్కిన ఈ సిరీస్​ మార్చి 15న విడుదలైంది. అమెజాన్​ ప్రైమ్​లో తొమ్మిది భాగాలుగా విడుదలైన ఈ సిరీస్​ సామాజిక మాధ్యమాల్లో విశేషాదరణ దక్కించుకుంది. విమర్శకులు దీన్ని ప్రశంసిస్తుండగా.. కొన్ని సామాజిక-రాజకీయ వర్గాలు మాత్రం భిన్నగళాలు వినిపిస్తున్నాయి.

'పాతాళ్​లోక్'​ విడుదలైన తర్వాత ట్విట్టర్​లో ప్రేక్షకులు విభిన్న అభిప్రాయాలతో స్పందించారు. కొన్ని సన్నివేశాలపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అందులో ఓ మహిళా పోలీసు ఒక యువతిని కొట్టి సామాజిక అభ్యంతరకరమైన భాషలో పిలిచినప్పుడు అది ప్రేక్షకుల మనోభావాలను దెబ్బతీసిందని.. చిత్రబృందం ఆ భాగాన్ని సెన్సార్​ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Paatal Lok under fire, netizens demand apology from Anushka Sharma
సోషల్​మీడియాలో 'పాతాళ్​లోక్​' వివాదం

కొన్ని సన్నివేశాలు హిందువులను కించపరిచే విధంగా ఉన్నాయని వాటికి ముందుస్తు విజ్ఞప్తి లాంటివి ఏవీ లేవని కొంతమంది అసహనం వ్యక్తం చేశారు. ప్రైమ్​ను హిందూ వ్యతిరేకని పలువురు నెటిజన్లు అభివర్ణించారు. ఇలాంటి వివాదాల మధ్య కూడా ఈ వెబ్​సిరీస్​ ప్రశంసలు దక్కించుకుంటోంది.

తరుణ్​ తేజ్​పాల్​ రచించిన నవల ఆధారంగా 'పాతాళ్​లోక్​' తెరకెక్కింది. దర్శకుడు సుదీప్​ శర్మ సస్పెన్స్​, థ్రిల్లింగ్​తో పాటు పౌరాణిక అంశాలను కలిపి కథగా రాసుకున్నాడు.

ఇదీ చూడండి.. 'అన్నీ మారాయి.. కానీ మేం మాత్రం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.