ETV Bharat / sitara

సుశాంత్‌ పోస్ట్‌మార్టం నివేదికలో ఏం తేలిందంటే!

బాలీవుడ్​ హీరో సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ సింగ్​ ఆత్మహత్యకు సంబంధించిన తుది పోస్ట్​మార్టం రిపోర్టును పోలీసులకు సమర్పించారు వైద్యులు. ఉరి వేసుకోవడం వల్లే ఊపిరాడక మరణించినట్లు తేలింది.

author img

By

Published : Jun 24, 2020, 8:08 PM IST

Final post mortem report on suicide of Bollywood hero Sushant Singh Rajput Singh
సుశాంత్‌ తుది పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఏం తేలిందంటే!

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చిత్ర పరిశ్రమ వర్గాలు ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశాయి. గత ఆరు నెలలుగా తీవ్ర మానసిక ఒత్తిడి ఎదుర్కొన్న సుశాంత్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. తాజాగా సుశాంత్‌ ఆత్మహత్యకు సంబంధించిన తుది పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ను పోలీసులకు వైద్యులు సమర్పించారు. ఇందులో ఉరి వేసుకోవడం కారణంగా ఊపిరాడక సుశాంత్‌ మృతిచెందినట్లు తేలింది. ఇక సుశాంత్‌కు సంబంధించిన ఉదర భాగంలోని కొన్ని అవయవాలను ప్రత్యేక పరీక్షల నిమిత్తం పంపారు.

సుశాంత్‌ చనిపోయిన తర్వాత ఇచ్చిన పోస్ట్‌మార్టం నివేదికపై ముగ్గురు వైద్యులు సంతకం చేయగా, తుది నివేదికపై ఐదుగురు వైద్యులు సంతకం పెట్టారు. మరోవైపు డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌‌ సర్వీసెస్‌కు పోలీసులు లేఖ రాశారు. సుశాంత్‌ అవయవాలపై చేసే కెమికల్‌ పరీక్షల నివేదికలు కూడా త్వరగా సమర్పించాలని కోరారు. సుశాంత్‌ చనిపోయే ముందు ఆయన ఎలాంటి బాధనూ అనుభవించలేదట. శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. ఆయన గోళ్లు కూడా శుభ్రంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆయనది కచ్చితంగా ఆత్మహత్యేనని, ఇందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు.

ఎవరెవర్ని విచారించారంటే..?

సుశాంత్‌ కేసుకు సంబంధించి మొత్తం 23 మంది వాంగ్మూలాల్ని పోలీసులు నమోదు చేశారు. వీరిలో సుశాంత్‌ సీఏ సంజయ్‌ శ్రీధర్‌ 23 వ్యక్తి. ఆయన కాకుండా సుశాంత్‌ తండ్రి, ముగ్గురు సోదరిలు, అతని స్నేహితుడు సిద్ధార్థ్‌ పిథాని, వంట మనిషి కేశవ్‌, తలుపు తెరిచిన తాళాల పనివాడు మొహద్‌ షేక్‌, అతని సోదరుడు షకీల్‌ హుస్సేన్‌, బిజినెస్‌ మేనేజర్‌ ఉదయ్‌ సింగ్‌ గౌరీ, పీఆర్‌ మేనేజర్‌ రాధికా నిహ్లానీ, సుశాంత్‌ మొదటి సీరియల్‌ దర్శకుడు కుశాల్‌ ఝవేరి, రియా చక్రవర్తి, ముఖేశ్‌ చబ్రా తదితరులను పోలీసులు విచారించారు. దీంతో పాటు, సీసీటీవీ ఫుటేజీలు, సుశాంత్‌ పెంచుకుంటున్న శునకాన్ని కూడా పరీక్షించారు.

ఇదీ చూడండి:సుశాంత్​ రాజ్​పుత్​ చివరి ఎమోషనల్​ పోస్ట్​

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చిత్ర పరిశ్రమ వర్గాలు ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశాయి. గత ఆరు నెలలుగా తీవ్ర మానసిక ఒత్తిడి ఎదుర్కొన్న సుశాంత్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. తాజాగా సుశాంత్‌ ఆత్మహత్యకు సంబంధించిన తుది పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ను పోలీసులకు వైద్యులు సమర్పించారు. ఇందులో ఉరి వేసుకోవడం కారణంగా ఊపిరాడక సుశాంత్‌ మృతిచెందినట్లు తేలింది. ఇక సుశాంత్‌కు సంబంధించిన ఉదర భాగంలోని కొన్ని అవయవాలను ప్రత్యేక పరీక్షల నిమిత్తం పంపారు.

సుశాంత్‌ చనిపోయిన తర్వాత ఇచ్చిన పోస్ట్‌మార్టం నివేదికపై ముగ్గురు వైద్యులు సంతకం చేయగా, తుది నివేదికపై ఐదుగురు వైద్యులు సంతకం పెట్టారు. మరోవైపు డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌‌ సర్వీసెస్‌కు పోలీసులు లేఖ రాశారు. సుశాంత్‌ అవయవాలపై చేసే కెమికల్‌ పరీక్షల నివేదికలు కూడా త్వరగా సమర్పించాలని కోరారు. సుశాంత్‌ చనిపోయే ముందు ఆయన ఎలాంటి బాధనూ అనుభవించలేదట. శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. ఆయన గోళ్లు కూడా శుభ్రంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆయనది కచ్చితంగా ఆత్మహత్యేనని, ఇందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు.

ఎవరెవర్ని విచారించారంటే..?

సుశాంత్‌ కేసుకు సంబంధించి మొత్తం 23 మంది వాంగ్మూలాల్ని పోలీసులు నమోదు చేశారు. వీరిలో సుశాంత్‌ సీఏ సంజయ్‌ శ్రీధర్‌ 23 వ్యక్తి. ఆయన కాకుండా సుశాంత్‌ తండ్రి, ముగ్గురు సోదరిలు, అతని స్నేహితుడు సిద్ధార్థ్‌ పిథాని, వంట మనిషి కేశవ్‌, తలుపు తెరిచిన తాళాల పనివాడు మొహద్‌ షేక్‌, అతని సోదరుడు షకీల్‌ హుస్సేన్‌, బిజినెస్‌ మేనేజర్‌ ఉదయ్‌ సింగ్‌ గౌరీ, పీఆర్‌ మేనేజర్‌ రాధికా నిహ్లానీ, సుశాంత్‌ మొదటి సీరియల్‌ దర్శకుడు కుశాల్‌ ఝవేరి, రియా చక్రవర్తి, ముఖేశ్‌ చబ్రా తదితరులను పోలీసులు విచారించారు. దీంతో పాటు, సీసీటీవీ ఫుటేజీలు, సుశాంత్‌ పెంచుకుంటున్న శునకాన్ని కూడా పరీక్షించారు.

ఇదీ చూడండి:సుశాంత్​ రాజ్​పుత్​ చివరి ఎమోషనల్​ పోస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.