మహమ్మారి కరోనా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఎక్కడికక్కడ కేసులు పెరిగిపోతున్నాయి. మరణాలూ అదే స్థాయిలో ఉన్నాయి. పోలాండ్లో ఓ మంత్రికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధరించారు. ముందు జాగ్రత్తగా అక్కడి ప్రభుత్వ యంత్రాంగమంతా నిర్బంధంలో ఉంది.
ఈ నెల 10న పోలాండ్ సర్కార్ కీలక సమావేశం నిర్వహించింది. మంత్రులు సహా.. ప్రభుత్వ సిబ్బంది అంతా ఈ భేటీకి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఓ మంత్రికి వైరస్ సోకినట్లు తేలగా.. అందరినీ నిర్బంధంలో ఉంచి పరిశీలిస్తున్నారు.
కొవిడ్-19 పరీక్షలు చేసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు అధికారులు. అప్పటివరకు వీరంతా నిర్బంధంలో ఉండనున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: వైరస్సే కదా అని తేలిగ్గా చూస్తే.. అధ్యక్ష ఎన్నికలు ఆపేస్తా!