ETV Bharat / international

Zarifa Ghafari: 'తాలిబన్​ నేతలతో చర్చకు సిద్ధం'

అఫ్గాన్​ను వశపరుచుకున్న తాలిబన్ల(Taliban Afghanistan) నుంచి ఆమెకు ప్రాణహాని ఉందని ఆ దేశ తొలి మహిళ మేయర్​గా గుర్తింపు పొందిన జరిఫా గఫారీ(Zarifa Ghafari) అన్నారు. భారత్​లోని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తాలిబన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమెను హత్య చేసేందుకు తాలిబన్లు తన ఇంటి వరకు వెళ్లారని గరీఫా ఆరోపించారు.

author img

By

Published : Aug 25, 2021, 5:13 AM IST

Zarifa Ghafari
జరిఫా గఫారీ

అఫ్గానిస్థాన్​లో తొలి మహిళ మేయర్​గా గుర్తింపు పొందిన జరిఫా గఫారీ(Zarifa Ghafari).. ఆ దేశంలోని ప్రస్తుత పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. అఫ్గాన్​ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న నేపథ్యంలో జర్మనీకి పారిపోయిన గఫారీ.. తాలిబన్(Taliban Afghanistan) ఉగ్రమూక ఆమె కోసం వెతుకుతున్నారని ఆరోపించారు. వారికి వ్యతిరేకంగా మాట్లాడిన తనలాంటివారందరినీ తాలిబన్లు తప్పకుండా హత్య చేస్తారని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ మేరకు తాలిబన్లు ఓ జాబితాను కూడా సిద్ధం చేసుకున్నారని ఆరోపించారు.

"ఏ ఒక్కరినీ నేను క్షమించను. గత 20 ఏళ్లలో సాధించినవన్నీ కోల్పోయాం. ప్రస్తుతం నా దగ్గర ఏమీ లేదు. నా దేశం నుంచి తెచ్చుకున్న మట్టి తప్ప."

--జరిఫా గఫారీ, మాజీ తొలి మహిళ మేయర్.

తాలిబన్లు ఎలాంటి వారో ఇతరులకు తెలియకూడదనే ఉద్దేశంతోనే వారు పలువురుని హత్య చేస్తున్నారని గఫారీ అన్నారు. అఫ్గాన్​లు తమకు వ్యతిరేకంగా పోరాటం చేయడం తాలిబన్లకు నచ్చదని పేర్కొన్నారు. చాలా మంది నాయకులు, జర్నలిస్టులు అఫ్గాన్​ను విడిచి పారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

"అఫ్గాన్​ భూభాగం మాదే. ఎప్పటికైనా అది మాదే. ఉన్నతాధికారులను కలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. పలు నాయకులను, వివిధ దేశాల్లోని మహిళలను కలిసి అఫ్గాన్​లో ఉన్న అసలైన పరిస్థితిని వివరిస్తాను. వారి మద్దతుతో ఓ ఉద్యమం మొదలుపెడతాను."

--జరిఫా గఫారీ.

తాలిబన్లు తన తండ్రిని హత్యచేసినప్పటికీ.. ఆయన మరణాన్ని మరచి వారితో చర్చలు జరిపేందుకు సిద్ధమైనట్లు తెలిపారు గఫారీ. తమ దేశంలోని మహిళల తరఫున ఆమె తాలిబన్​ నాయకులతో మాట్లాడుతానని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:'తాలిబన్ల చేతిలో చావు కోసం ఎదురుచూస్తున్నా'

అఫ్గానిస్థాన్​లో తొలి మహిళ మేయర్​గా గుర్తింపు పొందిన జరిఫా గఫారీ(Zarifa Ghafari).. ఆ దేశంలోని ప్రస్తుత పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. అఫ్గాన్​ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న నేపథ్యంలో జర్మనీకి పారిపోయిన గఫారీ.. తాలిబన్(Taliban Afghanistan) ఉగ్రమూక ఆమె కోసం వెతుకుతున్నారని ఆరోపించారు. వారికి వ్యతిరేకంగా మాట్లాడిన తనలాంటివారందరినీ తాలిబన్లు తప్పకుండా హత్య చేస్తారని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ మేరకు తాలిబన్లు ఓ జాబితాను కూడా సిద్ధం చేసుకున్నారని ఆరోపించారు.

"ఏ ఒక్కరినీ నేను క్షమించను. గత 20 ఏళ్లలో సాధించినవన్నీ కోల్పోయాం. ప్రస్తుతం నా దగ్గర ఏమీ లేదు. నా దేశం నుంచి తెచ్చుకున్న మట్టి తప్ప."

--జరిఫా గఫారీ, మాజీ తొలి మహిళ మేయర్.

తాలిబన్లు ఎలాంటి వారో ఇతరులకు తెలియకూడదనే ఉద్దేశంతోనే వారు పలువురుని హత్య చేస్తున్నారని గఫారీ అన్నారు. అఫ్గాన్​లు తమకు వ్యతిరేకంగా పోరాటం చేయడం తాలిబన్లకు నచ్చదని పేర్కొన్నారు. చాలా మంది నాయకులు, జర్నలిస్టులు అఫ్గాన్​ను విడిచి పారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

"అఫ్గాన్​ భూభాగం మాదే. ఎప్పటికైనా అది మాదే. ఉన్నతాధికారులను కలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. పలు నాయకులను, వివిధ దేశాల్లోని మహిళలను కలిసి అఫ్గాన్​లో ఉన్న అసలైన పరిస్థితిని వివరిస్తాను. వారి మద్దతుతో ఓ ఉద్యమం మొదలుపెడతాను."

--జరిఫా గఫారీ.

తాలిబన్లు తన తండ్రిని హత్యచేసినప్పటికీ.. ఆయన మరణాన్ని మరచి వారితో చర్చలు జరిపేందుకు సిద్ధమైనట్లు తెలిపారు గఫారీ. తమ దేశంలోని మహిళల తరఫున ఆమె తాలిబన్​ నాయకులతో మాట్లాడుతానని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:'తాలిబన్ల చేతిలో చావు కోసం ఎదురుచూస్తున్నా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.