ETV Bharat / international

కరోనా రోగులకు ఐ-ప్యాడ్లు పంపిణీ

author img

By

Published : May 10, 2020, 9:18 AM IST

Updated : May 10, 2020, 12:10 PM IST

ఒంటరిగా ఉన్నామని దిగులు చెందకుండా ఉండేందుకు కరోనా రోగులకు ఐ-ప్యాడ్​లు ఇస్తున్నారు అమెరికా వైద్యులు. ప్రజల ద్వారా వీటిని సేకరించి శానిటైజ్​ చేసిన అనంతరం రోగులకు అందజేస్తున్నారు.

doctors in america giving i-pads to corona patients
కరోనా రోగులకు ఐ-ప్యాడ్లు పంపిణీ

కరోనా వైరస్‌ బారిన పడి ఆసుపత్రిలో అనాథల్లా తల్లడిల్లుతున్న వారి ఒంటరితనాన్ని పోగొట్టడానికి అమెరికాలోని వైద్యులు కొందరు మానవతను చాటుతున్నారు. పెద్ద వయసు రోగులకు తాము ఒంటరిమనే బాధ కలగనీయకుండా ‘మిషన్‌ ఐ-ప్యాడ్‌ సేకరణ’ ఉద్యమం ప్రారంభించారు. ప్రజల నుంచి ఐ-ప్యాడ్‌లు, ఫోన్లనూ సురక్షిత విధానాల్లో సేకరిస్తున్నారు. శానిటైజ్‌ చేసిన తర్వాత వాటిని రోగులకు అందిస్తున్నారు. వీటితో బాధితులు వీడియో కాల్‌ చేసుకుంటూ సాంత్వన పొందుతున్నారు.

బోస్టన్‌లో మొదలైన ఈ ఉద్యమం ప్రస్తుతం 20 రాష్ట్రాలకు విస్తరించింది. వైద్యుల చొరవతో కొందరు రోగులు కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ, ధైర్యం తెచ్చుకుంటూ కొవిడ్‌ను జయిస్తున్నారు. ఇళ్లకు వెళ్లే సమయంలో వైద్యులను మనసారా దీవిస్తున్నారు.

కరోనా వైరస్‌ బారిన పడి ఆసుపత్రిలో అనాథల్లా తల్లడిల్లుతున్న వారి ఒంటరితనాన్ని పోగొట్టడానికి అమెరికాలోని వైద్యులు కొందరు మానవతను చాటుతున్నారు. పెద్ద వయసు రోగులకు తాము ఒంటరిమనే బాధ కలగనీయకుండా ‘మిషన్‌ ఐ-ప్యాడ్‌ సేకరణ’ ఉద్యమం ప్రారంభించారు. ప్రజల నుంచి ఐ-ప్యాడ్‌లు, ఫోన్లనూ సురక్షిత విధానాల్లో సేకరిస్తున్నారు. శానిటైజ్‌ చేసిన తర్వాత వాటిని రోగులకు అందిస్తున్నారు. వీటితో బాధితులు వీడియో కాల్‌ చేసుకుంటూ సాంత్వన పొందుతున్నారు.

బోస్టన్‌లో మొదలైన ఈ ఉద్యమం ప్రస్తుతం 20 రాష్ట్రాలకు విస్తరించింది. వైద్యుల చొరవతో కొందరు రోగులు కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ, ధైర్యం తెచ్చుకుంటూ కొవిడ్‌ను జయిస్తున్నారు. ఇళ్లకు వెళ్లే సమయంలో వైద్యులను మనసారా దీవిస్తున్నారు.

Last Updated : May 10, 2020, 12:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.