ETV Bharat / crime

Adilabad Accident Today: రెండు ద్విచక్రవాహనాలు ఢీ.. ముగ్గురు దుర్మరణం

author img

By

Published : Dec 25, 2021, 10:55 AM IST

అతి వేగం మూడు నిండు ప్రాణాలను బలికొంది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఈ విషాద ఘటన తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది.

Adilabad Accident Today
Adilabad Accident Today

Adilabad Accident: తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఉట్నూరు మండలం కుమ్మరి తండా వద్ద రాత్రి రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. ఘటనాస్థలిలో నార్నూర్‌ మండలం తడిహత్నూర్‌కు చెందిన ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా... రిమ్స్‌లో చికిత్స పొందుతూ పెరికగూడకు చెందిన యువకుడు మృతి చెందాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.

Adilabad Accident: తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఉట్నూరు మండలం కుమ్మరి తండా వద్ద రాత్రి రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. ఘటనాస్థలిలో నార్నూర్‌ మండలం తడిహత్నూర్‌కు చెందిన ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా... రిమ్స్‌లో చికిత్స పొందుతూ పెరికగూడకు చెందిన యువకుడు మృతి చెందాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.

ఇదీ చూడండి:

gas leakage in chemical industry : రసాయన పరిశ్రమలో గ్యాస్‌ లీక్‌.. ఐదుగురికి అస్వస్థత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.