ETV Bharat / city

నష్టపరిహారం అందకపోతే అసెంబ్లీ ముట్టడి తప్పుదు: శివశంకర్

author img

By

Published : Dec 30, 2020, 5:34 PM IST

సీఎం జగన్​పై జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆగ్రహం వ్యక్తం చేశారు. నివర్ తుపాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నష్టపరిహారంపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.

janasena Leader Shiva Shankar
janasena Leader Shiva Shankar

నివర్ తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ విశాఖలో ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులకు నష్టపరిహారం ముప్పై వేలు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారని గుర్తు చేశారు. ఇవాళ సీఎం పీఠం దక్కిన తరువాత రైతుల బాధలు జగన్​కు గుర్తుకు రావటం లేదా..? అని నిలదీశారు. రైతు భరోసా డబ్బులు వేసి వాటినే నష్టపరిహారంగా చూపించడం సరైన పద్ధతి కాదని అన్నారు. రైతులకు నష్టపరిహారం ఇస్తారా.. ఇవ్వరా..?... ఇస్తే ఎంత ఇస్తారు... ఎప్పుడు ఇస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు నష్టపరిహారం అందకపోతే అసెంబ్లీ ముట్టడి తప్పదని హెచ్చరించారు.

నోరు పారేసుకోవడం కాదు.. చర్చించండి: బోనబోయిన

నివర్ తుపాన్ బాధితులను ఆదుకోవాలని పవన్ డిమాండ్‌ చేశారని జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దానిపై చర్చ లేకుండా పవన్ పై మంత్రులు నోరు పారేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు తెలిసి చంద్రబాబుకు, కొడాలి నానికి ఏదో సంబంధం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబును ప్రజలు ఓడించినా..‌ ఆయన్ని వైకాపా నేతలు మరచిపోలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ పై నోళ్లేసుకుని పడటమే తప్ప‌.. రైతుల గురించి మాత్రం ఒక్కరూ మాట్లాడలేదన్నారు. తుపాన్ బాధిత రైతులకు నష్టపరిహారం ఇవ్వకపోతే అసెంబ్లీ ముట్టడిస్తాం అని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

మాజీ రాష్ట్రపతి చిత్రపటానికి అవమానం.. చెత్తలో పారేశారు

నివర్ తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ విశాఖలో ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులకు నష్టపరిహారం ముప్పై వేలు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారని గుర్తు చేశారు. ఇవాళ సీఎం పీఠం దక్కిన తరువాత రైతుల బాధలు జగన్​కు గుర్తుకు రావటం లేదా..? అని నిలదీశారు. రైతు భరోసా డబ్బులు వేసి వాటినే నష్టపరిహారంగా చూపించడం సరైన పద్ధతి కాదని అన్నారు. రైతులకు నష్టపరిహారం ఇస్తారా.. ఇవ్వరా..?... ఇస్తే ఎంత ఇస్తారు... ఎప్పుడు ఇస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు నష్టపరిహారం అందకపోతే అసెంబ్లీ ముట్టడి తప్పదని హెచ్చరించారు.

నోరు పారేసుకోవడం కాదు.. చర్చించండి: బోనబోయిన

నివర్ తుపాన్ బాధితులను ఆదుకోవాలని పవన్ డిమాండ్‌ చేశారని జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దానిపై చర్చ లేకుండా పవన్ పై మంత్రులు నోరు పారేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు తెలిసి చంద్రబాబుకు, కొడాలి నానికి ఏదో సంబంధం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబును ప్రజలు ఓడించినా..‌ ఆయన్ని వైకాపా నేతలు మరచిపోలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ పై నోళ్లేసుకుని పడటమే తప్ప‌.. రైతుల గురించి మాత్రం ఒక్కరూ మాట్లాడలేదన్నారు. తుపాన్ బాధిత రైతులకు నష్టపరిహారం ఇవ్వకపోతే అసెంబ్లీ ముట్టడిస్తాం అని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

మాజీ రాష్ట్రపతి చిత్రపటానికి అవమానం.. చెత్తలో పారేశారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.