ETV Bharat / city

అమ్మోనియం నైట్రేట్ నిల్వలో ఉల్లంఘనలు.. శ్రావణ్​ షిప్పింగ్ సంస్థపై నిషేధం

author img

By

Published : Sep 14, 2020, 9:40 PM IST

Updated : Sep 15, 2020, 2:25 AM IST

విశాఖలో అమ్మోనియం నైట్రేట్ దిగుమతి, రవాణా చేస్తున్న శ్రావణ్​ షిప్పింగ్ సంస్థ కార్యకలాపాలపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి తాత్కాలిక నిషేధం విధించింది. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. అమ్మోనియం నిల్వలో శ్రావణ్​ షిప్పింగ్ సంస్థ నిబంధనలు పాటించలేదని, అందుకే సంస్థ కార్యకలాపాలు నిషేధించామని పీసీబీ స్పష్టం చేసింది. సంస్థ కార్యకలాపాలు అనుమతించవద్దని విశాఖపట్నం పోర్టు ఛైర్మన్​ను కూడా పీసీబీ కోరింది.

అమ్మోనియం నైట్రేట్ నిల్వలో ఉల్లంఘనలు... శ్రావణి షిప్పింగ్ సంస్థపై నిషేధం
అమ్మోనియం నైట్రేట్ నిల్వలో ఉల్లంఘనలు... శ్రావణి షిప్పింగ్ సంస్థపై నిషేధం

విశాఖలో అమ్మోనియం నైట్రేట్ దిగుమ‌తి, ర‌వాణా చేసే షిప్పింగ్ సంస్థ శ్రావణ్​ షిప్పింగ్ కార్యక‌లాపాల‌పై రాష్ట్ర కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి తాత్కాలిక నిషేధం విధించింది. ఈ మేర‌కు విశాఖ‌లోని జాయింట్ చీఫ్ ఎన్విరాన్​మెంట‌్ ఇంజినీరు బోర్డు ఛైర్మ‌న్ ఉత్త‌ర్వులు ఇచ్చారు. ప‌ర్యావ‌ర‌ణ, భ‌ద్ర‌తాప‌రంగా అమ్మోనియం నైట్రేట్ నిల్వ విష‌యంలో శ్రావ‌ణ్​ షిప్పింగ్ సంస్థ నిబంధ‌న‌ల‌ను పాటించ‌లేద‌ని ఇప్ప‌టికే నోటీసులు ఇచ్చారు. విశాఖ న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్... శ్రావ‌ణ్​ షిప్పింగ్​లో ప‌లు ఉల్లంఘ‌న‌లు గుర్తించి నాగ‌పూర్​లోని చీఫ్ కంట్రోల‌ర్ ఆఫ్ ఎక్స్​ప్లోజివ్స్​కి దీనిపై చ‌ర్య‌ల‌ కోసం ఇప్ప‌టికే నివేదించారు.

తాజా ఉత్తర్వులతో అమ్మోనియం నైట్రేట్ దిగుమ‌తి, ర‌వాణాలో గ‌త 20 ఏళ్లుగా కార్యకలాపాలు చేస్తున్న శ్రావ‌ణ్​ షిప్పింగ్ సంస్థపై నిషేధం ప‌డింది. అమ్మోనియం నైట్రేట్ నిల్వ‌ల‌లో ప‌ర్యావ‌ర‌ణ‌, భ‌ద్ర‌తాపర‌మైన కేంద్ర ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన‌ట్టుగా గుర్తించి ఇప్ప‌టికే నోటీసులు ఇచ్చిన‌ట్టు కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి వెల్ల‌డించింది. మ‌ళ్లీ ఉత్త‌ర్వులు వ‌చ్చే వ‌ర‌కు శ్రావ‌ణ్​ షిప్పింగ్ కంపెనీని అమ్మోనియం నైట్రేట్ ఆధారిత దిగుమ‌తి కార్య‌క‌లాపాల‌ను అనుమ‌తించ‌వ‌ద్దంటూ విశాఖ‌పట్నం పోర్టు ఛైర్మ‌న్​ను కూడా కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి కోరింది.

విశాఖలో అమ్మోనియం నైట్రేట్ దిగుమ‌తి, ర‌వాణా చేసే షిప్పింగ్ సంస్థ శ్రావణ్​ షిప్పింగ్ కార్యక‌లాపాల‌పై రాష్ట్ర కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి తాత్కాలిక నిషేధం విధించింది. ఈ మేర‌కు విశాఖ‌లోని జాయింట్ చీఫ్ ఎన్విరాన్​మెంట‌్ ఇంజినీరు బోర్డు ఛైర్మ‌న్ ఉత్త‌ర్వులు ఇచ్చారు. ప‌ర్యావ‌ర‌ణ, భ‌ద్ర‌తాప‌రంగా అమ్మోనియం నైట్రేట్ నిల్వ విష‌యంలో శ్రావ‌ణ్​ షిప్పింగ్ సంస్థ నిబంధ‌న‌ల‌ను పాటించ‌లేద‌ని ఇప్ప‌టికే నోటీసులు ఇచ్చారు. విశాఖ న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్... శ్రావ‌ణ్​ షిప్పింగ్​లో ప‌లు ఉల్లంఘ‌న‌లు గుర్తించి నాగ‌పూర్​లోని చీఫ్ కంట్రోల‌ర్ ఆఫ్ ఎక్స్​ప్లోజివ్స్​కి దీనిపై చ‌ర్య‌ల‌ కోసం ఇప్ప‌టికే నివేదించారు.

తాజా ఉత్తర్వులతో అమ్మోనియం నైట్రేట్ దిగుమ‌తి, ర‌వాణాలో గ‌త 20 ఏళ్లుగా కార్యకలాపాలు చేస్తున్న శ్రావ‌ణ్​ షిప్పింగ్ సంస్థపై నిషేధం ప‌డింది. అమ్మోనియం నైట్రేట్ నిల్వ‌ల‌లో ప‌ర్యావ‌ర‌ణ‌, భ‌ద్ర‌తాపర‌మైన కేంద్ర ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన‌ట్టుగా గుర్తించి ఇప్ప‌టికే నోటీసులు ఇచ్చిన‌ట్టు కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి వెల్ల‌డించింది. మ‌ళ్లీ ఉత్త‌ర్వులు వ‌చ్చే వ‌ర‌కు శ్రావ‌ణ్​ షిప్పింగ్ కంపెనీని అమ్మోనియం నైట్రేట్ ఆధారిత దిగుమ‌తి కార్య‌క‌లాపాల‌ను అనుమ‌తించ‌వ‌ద్దంటూ విశాఖ‌పట్నం పోర్టు ఛైర్మ‌న్​ను కూడా కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి కోరింది.

ఇదీ చదవండి : అమ్మోనియం నైట్రేట్‌ నిల్వలో ఉల్లంఘనలు

Last Updated : Sep 15, 2020, 2:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.