ETV Bharat / city

గొలుసు దొంగతనాలకు.. ఆడియోతో చెక్ !

గొలుసు దొంగల బారి నుంచి ప్రజలను రక్షించేందుకు విజయవాడ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దొంగతనాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఆడియో ద్వారా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

author img

By

Published : May 11, 2019, 7:27 PM IST

గొలుసు దొంగతనాలకు ఆడియోతో చెక్
గొలుసు దొంగతనాలకు ఆడియోతో చెక్

విజయవాడ నగరంలో జరుగుతున్న గొలుసు దొంగతనాలను అరికట్టేందుకు పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దొంగతనాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆడియోను తయారు చేసి ప్రచారం చేస్తున్నారు. నగర శివార్లలోని గ్రామీణ ప్రాంతాల్లో పెట్రోలింగ్ వాహనాలు, స్థానికంగా ఆటోల ద్వారా ఆడియోను ప్రజలకు వినిపిస్తున్నారు. నేరాలను తగ్గించేందుకు ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు. గొలుసు దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో వాహనాల తనిఖీలను విస్తృతం చేశామని పోలీసులు స్పష్టం చేశారు.

గొలుసు దొంగతనాలకు ఆడియోతో చెక్

విజయవాడ నగరంలో జరుగుతున్న గొలుసు దొంగతనాలను అరికట్టేందుకు పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దొంగతనాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆడియోను తయారు చేసి ప్రచారం చేస్తున్నారు. నగర శివార్లలోని గ్రామీణ ప్రాంతాల్లో పెట్రోలింగ్ వాహనాలు, స్థానికంగా ఆటోల ద్వారా ఆడియోను ప్రజలకు వినిపిస్తున్నారు. నేరాలను తగ్గించేందుకు ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు. గొలుసు దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో వాహనాల తనిఖీలను విస్తృతం చేశామని పోలీసులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

ఘోర రోడ్డుప్రమాదం.. 14 మంది మృతి

Intro:కిట్ నం: 879,విశాఖ సిటీ, ఎం.డి.అబ్దుల్లా.

( ) పెట్టుబడిదారీ విధానం శ్రమ శక్తిని, భూ శక్తిని విధ్వంసం చేస్తుందని శతాబ్దాల క్రితం కార్ల్ మార్క్స్ విశ్లేషించాడని ప్రముఖ ఆర్థికవేత్త ఎస్ ఏ విద్యాసాగర్ అన్నారు. అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో విశాఖ పౌర గ్రంథాలయంలో కార్ల్ మార్క్స్ ద్విశత జయంతి నిర్వహించారు. సమకాలీన సమాజంలో జరుగుతున్న ఆర్థిక, రాజకీయ, సాంఘిక ,సాంస్కృతిక పరిణామాలను శాస్త్రీయంగా పరిశోధించి భావితరాలకు విముక్తి బాటను సూచించిన పురోగామి కార్ల్ మార్స్ అని విద్యాసాగర్ అభివర్ణించారు.


Body:విప్లవాలు సామాజిక పరిపక్వ స్థితిని చేరుకున్న సమయంలో లో కార్మిక శక్తి నాయకత్వంలో సహకారం అవుతాయని ఆనాడే కార్ల్ మార్స్ చెప్పారని అన్నారు. శ్రమ, పెట్టుబడి అంశాలను శాస్త్రీయంగా నిర్వహించి భావి సమాజం రూపురేఖలను దర్శించిన వాడు ఆ మహాతత్వవేత్త అని గుర్తు చేశారు.


Conclusion:కార్యక్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆచార్యుడు కె వెంకటేశ్వర్లు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్.నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

బైట్: ఎస్.ఎ.విద్యా సాగర్, ప్రముఖ ఆర్ధిక వేత్త.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.