ETV Bharat / city

21న తిరుపతిలో జనసేన కీలక సమావేశం... పాల్గొననున్న పవన్

author img

By

Published : Jan 15, 2021, 3:20 PM IST

ఈ నెల 21న తిరుపతిలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ కానుంది. జనసేనాని పవన్ కల్యాణ్ ఇందులో పాల్గొననున్నారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెట్టాలా?.. లేదా మిత్రపక్షం భాజపాకు మద్దతు ఇవ్వాలా? అనే విషయంపై ఇందులో ప్రధానంగా చర్చించనున్నారు.

Pawan Kalyan
Pawan Kalyan

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈ నెల 21న సమావేశం కానుంది. తిరుపతిలో జరిగే ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్​తో పాటు పీఏసీ సభ్యులు పాల్గొంటారు. తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న దృష్ట్యా ఈ సారి సమావేశం ఇక్కడ నిర్వహించనున్నారు. ఉప ఎన్నికలో పోటీతో పాటు రాష్ట్రంలోని రాజకీయ అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.

భాజపాతో పొత్తు నేపథ్యంలో అక్కడ ఏ పార్టీ తరఫున అభ్యర్థిని నిలపాలనేది ఇంకా నిర్ణయించలేదు. మరోవైపు పోటీకి భాజపా ఉత్సాహం చూపుతోంది. ఈ తరుణంలో అక్కడ జనసేన పోటీ చేయాలా.. లేదా.. అన్నది ఈ కార్యక్రమంలో ప్రధాన ఎజెండా కానుంది. అలాగే పంచాయతీ ఎన్నికల విషయంపైనా చర్చించే అవకాశముంది.

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈ నెల 21న సమావేశం కానుంది. తిరుపతిలో జరిగే ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్​తో పాటు పీఏసీ సభ్యులు పాల్గొంటారు. తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న దృష్ట్యా ఈ సారి సమావేశం ఇక్కడ నిర్వహించనున్నారు. ఉప ఎన్నికలో పోటీతో పాటు రాష్ట్రంలోని రాజకీయ అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.

భాజపాతో పొత్తు నేపథ్యంలో అక్కడ ఏ పార్టీ తరఫున అభ్యర్థిని నిలపాలనేది ఇంకా నిర్ణయించలేదు. మరోవైపు పోటీకి భాజపా ఉత్సాహం చూపుతోంది. ఈ తరుణంలో అక్కడ జనసేన పోటీ చేయాలా.. లేదా.. అన్నది ఈ కార్యక్రమంలో ప్రధాన ఎజెండా కానుంది. అలాగే పంచాయతీ ఎన్నికల విషయంపైనా చర్చించే అవకాశముంది.

ఇదీ చదవండి

నరసరావుపేట గోపూజలో పాల్గొన్న సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.