ETV Bharat / city

CANCER MEDICINES: వేధిస్తున్న క్యాన్సర్ మందుల కొరత.. స్పందించిన అధికారులు

author img

By

Published : Oct 23, 2021, 8:42 PM IST

గుంటూరు జీజీహెచ్‌(guntur GGH)లో క్యాన్సర్‌(cancer)కు సంబంధించిన కీమోథెరపీ(chemotherapy) ఔషధాల కొరతతో రోగులు(patients) అవస్థలు పడుతున్నారు. బయట కొనుక్కోవాలని వైద్యులు సూచిస్తున్నారంటూ వాపోతున్నారు. ఎంతో ఖరీదైన ఈ మందులు కొనే ఆర్థిక స్థోమత లేదని ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు(superintendent) ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదంటున్నారు. ఈ పరిస్థితిపై ఈటీవీ - ఈటీవీ భారత్​లో ప్రసారమైన కథనంపై అధికారులు స్పందించారు. మందుల కొరత తగ్గించాలని ఆదేశించారు.

వేధిస్తున్న క్యాన్సర్ మందుల కొరత
వేధిస్తున్న క్యాన్సర్ మందుల కొరత

గుంటూరు జీజీహెచ్​(guntur GGH)లో క్యాన్సర్‌ వైద్యం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి రోగులు వస్తుంటారు. ఈ ఆస్పత్రిలో క్యాన్సర్‌ చికిత్సకు ఉపయోగపడే సకల సదుపాయాలు అందుబాటులో ఉండటంతో తాకిడి ఎక్కువగానే ఉంటుంది. కానీ కొన్ని రోజులుగా నిర్దేశిత మందుల బడ్జెట్‌(medicines budget) అయిపోయిందని, ఉచిత మందులు లేవని వైద్యులు చెబుతున్నారు. సరైన మందులు లేక కొందరు పేషెంట్లకు రేడియేషన్‌(radiation) ఇచ్చి సరిపెడుతున్నారు. అత్యవసరమైతే మందులు బయట కొనుగోలు చేయాలని రోగులకు వైద్యులు సూచిస్తున్నారు. దీనివల్ల ఖరీదైన మందులు కొనుగోలు చేయలేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. మందులు లేకపోవడంతో సకాలంలో జరగాల్సిన కీమోథెరపీ జరగట్లేదని వాపోతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వైద్యం కోసం వచ్చిన రోగులు రవాణా ఛార్జీలకు తోడు మందుల భారం భరించలేకపోతున్నామని చెబుతున్నారు.

వేధిస్తున్న క్యాన్సర్ మందుల కొరత

అధికారుల స్పందన...

ఆస్పత్రిలో మందుల కొరత ఉందని, వీలైనంత వరకు రోగులకు వైద్య సేవలు(medical services) అందిస్తున్నామని సూపరింటెండెంట్ ప్రభావతి అంటున్నారు. ఇతర జిల్లాల నుంచి రోగుల తాకిడి ఎక్కువగా ఉందని, ఇప్పటికే కోటా మేరకు మందులు వాడేశామన్నారు. ఈ విషయాన్ని డీఎమ్ఈ(DME) దృష్టికి తీసుకెళ్లామని, ఇతర జిల్లాల నుంచి డైవర్షన్‌ పెట్టి సర్దుబాటు చేస్తామని చెప్పారన్నారు. గుత్తేదారులకు కోటి రూపాయల వరకు బకాయిలు ఉండటంతో సరఫరా నిలిపివేసినట్లు సూపరింటెండెంట్ చెబుతున్నారు. ఈ పరిస్థితిపై ఈటీవీ-ఈటీవీ భారత్​లో ప్రసారమైన కథనంపై అధికారులు స్పందించారు. మందుల కొరత తగ్గించాలని ఆదేశించారు.

ఇవీ చదవండి.

గుంటూరు జీజీహెచ్​(guntur GGH)లో క్యాన్సర్‌ వైద్యం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి రోగులు వస్తుంటారు. ఈ ఆస్పత్రిలో క్యాన్సర్‌ చికిత్సకు ఉపయోగపడే సకల సదుపాయాలు అందుబాటులో ఉండటంతో తాకిడి ఎక్కువగానే ఉంటుంది. కానీ కొన్ని రోజులుగా నిర్దేశిత మందుల బడ్జెట్‌(medicines budget) అయిపోయిందని, ఉచిత మందులు లేవని వైద్యులు చెబుతున్నారు. సరైన మందులు లేక కొందరు పేషెంట్లకు రేడియేషన్‌(radiation) ఇచ్చి సరిపెడుతున్నారు. అత్యవసరమైతే మందులు బయట కొనుగోలు చేయాలని రోగులకు వైద్యులు సూచిస్తున్నారు. దీనివల్ల ఖరీదైన మందులు కొనుగోలు చేయలేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. మందులు లేకపోవడంతో సకాలంలో జరగాల్సిన కీమోథెరపీ జరగట్లేదని వాపోతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వైద్యం కోసం వచ్చిన రోగులు రవాణా ఛార్జీలకు తోడు మందుల భారం భరించలేకపోతున్నామని చెబుతున్నారు.

వేధిస్తున్న క్యాన్సర్ మందుల కొరత

అధికారుల స్పందన...

ఆస్పత్రిలో మందుల కొరత ఉందని, వీలైనంత వరకు రోగులకు వైద్య సేవలు(medical services) అందిస్తున్నామని సూపరింటెండెంట్ ప్రభావతి అంటున్నారు. ఇతర జిల్లాల నుంచి రోగుల తాకిడి ఎక్కువగా ఉందని, ఇప్పటికే కోటా మేరకు మందులు వాడేశామన్నారు. ఈ విషయాన్ని డీఎమ్ఈ(DME) దృష్టికి తీసుకెళ్లామని, ఇతర జిల్లాల నుంచి డైవర్షన్‌ పెట్టి సర్దుబాటు చేస్తామని చెప్పారన్నారు. గుత్తేదారులకు కోటి రూపాయల వరకు బకాయిలు ఉండటంతో సరఫరా నిలిపివేసినట్లు సూపరింటెండెంట్ చెబుతున్నారు. ఈ పరిస్థితిపై ఈటీవీ-ఈటీవీ భారత్​లో ప్రసారమైన కథనంపై అధికారులు స్పందించారు. మందుల కొరత తగ్గించాలని ఆదేశించారు.

ఇవీ చదవండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.