ETV Bharat / city

కరోనా అప్ డేట్స్ : జిల్లాలో కొత్తగా 496 కేసులు...4 మరణాలు

గుంటూరు జిల్లాలో కొత్తగా 496 కరోనా కేసులు నిర్ధరణ అయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 63,502కు చేరింది. తాజాగా వైరస్ బారిన పడి మరో నలుగురు మృతి చెందారు.

author img

By

Published : Oct 18, 2020, 10:28 PM IST

corona
corona

గుంటూరు జిల్లాలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. కొన్నిరోజులుగా తగ్గిన కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా జిల్లావ్యాప్తంగా 496 కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలుపుకుంటే జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 63వేల 502కు చేరుకున్నాయి.

కొత్తగా వచ్చిన కేసుల్లో అత్యధికంగా గుంటూరు నగరం నుంచి 76 కేసులున్నాయి. తర్వాత బాపట్లలో 40 కేసులు, నరసరావుపేట, రేపల్లెలో 26 కేసుల చొప్పున, తెనాలిలో 21, పొన్నూరు, కొల్లూరులో 18, సత్తెనపల్లిలో 15 కేసులు, తాడేపల్లి, వినుకొండలో 14 చొప్పున, నగరంలో 12, పెదకాకాని, శావల్యాపురంలో 11 కేసుల చొప్పున నిర్ధరణ అయ్యాయి. గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 57 వేల 925 మంది ఇంటికి చేరుకున్నారు. వైరస్ ప్రభావంతో ఇవాళ జిల్లాలో నలుగురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 584కి చేరింది. కరోనాతో అత్యధికంగా మృతిచెందిన వారి సంఖ్యలో గుంటూరు జిల్లా రెండో స్థానానికి చేరింది.

గుంటూరు జిల్లాలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. కొన్నిరోజులుగా తగ్గిన కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా జిల్లావ్యాప్తంగా 496 కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలుపుకుంటే జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 63వేల 502కు చేరుకున్నాయి.

కొత్తగా వచ్చిన కేసుల్లో అత్యధికంగా గుంటూరు నగరం నుంచి 76 కేసులున్నాయి. తర్వాత బాపట్లలో 40 కేసులు, నరసరావుపేట, రేపల్లెలో 26 కేసుల చొప్పున, తెనాలిలో 21, పొన్నూరు, కొల్లూరులో 18, సత్తెనపల్లిలో 15 కేసులు, తాడేపల్లి, వినుకొండలో 14 చొప్పున, నగరంలో 12, పెదకాకాని, శావల్యాపురంలో 11 కేసుల చొప్పున నిర్ధరణ అయ్యాయి. గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 57 వేల 925 మంది ఇంటికి చేరుకున్నారు. వైరస్ ప్రభావంతో ఇవాళ జిల్లాలో నలుగురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 584కి చేరింది. కరోనాతో అత్యధికంగా మృతిచెందిన వారి సంఖ్యలో గుంటూరు జిల్లా రెండో స్థానానికి చేరింది.

ఇదీ చదవండి

వచ్చే 24 గంటల్లో అల్పపీడనం.. 3 రోజులపాటు వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.