ETV Bharat / city

కొవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం ఛైర్మన్​గా జవహర్ రెడ్డి సేవలు ఉపసంహరణ

author img

By

Published : Jul 21, 2021, 5:59 AM IST

రాష్ట్ర కొవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం చైర్మన్​గా కే.ఎస్ జవహర్ రెడ్డి సేవలను ఉపసంహరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పూర్తి స్థాయిలో విధులను పునరుద్ధరిస్తూ ఆదేశాలు ఇచ్చింది.

ప్రభుత్వం ఉత్తర్వులు
ప్రభుత్వం ఉత్తర్వులు

రాష్ట్ర కొవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం చైర్మన్​గా కే.ఎస్ జవహర్ రెడ్డి సేవలను ఉపసంహరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పూర్తి స్థాయిలో విధులను పునరుద్ధరిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.

కొవిడ్ నియంత్రణ పర్యవేక్షణ కోసం ఆయన్ను నియమించిన సమయంలో టీటీడీ ఈవో రోజు వారీ కార్యకలాపాలను అదనపు ఈవో ధర్మారెడ్డికి అప్పగించిన ప్రభుత్వం.. ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నందున జవహర్ రెడ్డి సేవలను పూర్తిగా టీటీడీకి పరిమితం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ ఉత్తర్వులు జారీచేశారు.

రాష్ట్ర కొవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం చైర్మన్​గా కే.ఎస్ జవహర్ రెడ్డి సేవలను ఉపసంహరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పూర్తి స్థాయిలో విధులను పునరుద్ధరిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.

కొవిడ్ నియంత్రణ పర్యవేక్షణ కోసం ఆయన్ను నియమించిన సమయంలో టీటీడీ ఈవో రోజు వారీ కార్యకలాపాలను అదనపు ఈవో ధర్మారెడ్డికి అప్పగించిన ప్రభుత్వం.. ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నందున జవహర్ రెడ్డి సేవలను పూర్తిగా టీటీడీకి పరిమితం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ ఉత్తర్వులు జారీచేశారు.

ఇదీ చదవండి:

కుబేరుల 'రోదసి' పోరులో.. విశేషాలెన్నో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.