రాష్ట్ర ప్రభుత్వం తీరుపై నారా లోకేశ్ ఆగ్రహం - vizag tragedy newx today
ఎల్జీ పాలిమర్స్ సమీప గ్రామాల్లోని ప్రజలకు పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని... తెదేపా ముఖ్యనేత నారా లోకేశ్ ఆరోపించారు. ఈ మేరకు ఓ వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం తీరపై నారా లోకేష్ ఆగ్రహం
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనతో భయాందోళనకు గురైన ప్రజలకు... ప్రభుత్వం పునరావాసం కల్పించలేకపోయిందని... తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చీకటి పడకముందే ఇంటికి వెళ్లి పడుకున్నారని మండిపడ్డారు. ప్రజలేమో నడిరోడ్డుపై జాగారం చేయాల్సి వచ్చిందంటూ ఓ వీడియోను తన ట్విటర్లో పోస్ట్ చేశారు.