ETV Bharat / city

తుంగభద్ర పుష్కారాల్లో ఈ-టికెట్ విధానం రద్దు - తుంగభద్ర పుష్కారాల్లో ఈటీకెట్ విధానం

తుంగభద్ర పుష్కరాల్లో ఈ- టికెట్ విధానం అమలుపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రతిపక్షాలు, భక్తుల నుంచి తీవ్రమైన విమర్శలు రావటంతో ఈ-టికెట్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

తుంగభద్ర పుష్కారా
తుంగభద్ర పుష్కారా
author img

By

Published : Nov 17, 2020, 8:52 PM IST

కర్నూలు జిల్లాలో తుంగభద్ర పుష్కరాల్లో పాల్గొనే వారికి ఈ- టికెట్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. ఈనెల 20 నుంచి డిసెంబర్ 1 వరకు తుంగభద్ర పుష్కరాలు జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో పుష్కరాల్లో నదీ స్నానాలను నిషేధించారు. కేవలం పిండప్రదానాలు, పూజలు చేసేందుకు మాత్రమే అనుమతి ఇచ్చారు. వీరు కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్ సైట్ లో ఈ- టికెట్ విధానంలో స్లాట్ బుక్ చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై ప్రతిపక్షాలు, భక్తుల నుంచి తీవ్రమైన విమర్శలు రావటంతో... స్లాట్ బుకింగ్ విధానాన్ని రద్దు చేశామని... ఎక్కడైనా పిండప్రదానాలు, పూజలు చేసుకోవచ్చని కలెక్టర్ ప్రకటించారు.

ఇదీ చదవండి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.