ETV Bharat / city

CM Jagan: ఆదాయం తగ్గినా.. ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నాం: సీఎం

author img

By

Published : Jan 10, 2022, 12:56 PM IST

Updated : Jan 10, 2022, 4:11 PM IST

CM Jagan On Health Department In AP: కరోనా థర్డ్ వేవ్ వచ్చినా.. సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రుల్లో మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వాక్సినేషన్​నూ ఉద్దృతంగా చేపట్టినట్లు తెలిపారు. కొవిడ్ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా.. ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నామన్నారు.

cm jagan
cm jagan

CM Jagan On Health Department In AP: కొవిడ్ మేనేజ్​మెంట్​లో దేశానికి ఆదర్శంగా నిలబడేలా రాష్ట్ర హెల్త్ డిపార్టుమెంట్ పనిచేస్తోందని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చినా.. సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అందుకోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పలు ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన 144 ఆక్సిజన్ ప్లాంట్లను సీఎం జగన్ వర్చువల్​గా ప్రారంభించారు.

ఆక్సీజన్ కొరత వల్ల కొవిడ్ సెకండ్ వేవ్​లో ఏర్పడిన పరిస్థితులు తలెత్తకుండా.. ఆస్పత్రుల్లో మెరుగైన వసతులు ఏర్పాటు చేశామని సీఎం జగన్ స్పష్టం చేశారు. రూ.426 కోట్ల వ్యయంతో పలు ఆస్పత్రుల్లో ఆక్సీజన్ ప్లాంట్లు, కీలక పరికరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 24,419 ఆక్సీజన్ పడకలతో సహా.. మొత్తం 39 లిక్విడ్ మెడికల్ ఆక్సీజన్ ట్యాంకులు సిద్ధం చేశామన్నారు. 32 పీఎస్​ఏ ఆక్సీజన్ ప్లాంట్లను ఇప్పటికే జాతికి అంకితం చేశామన్న సీఎం... 144 ప్లాంట్లను రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 74 ఎల్​ఎంవో ట్యాంకులు కొనుగోలు చేసి అందుబాటులో ఉంచామన్నారు. 230 కిలో లీటర్ల సామర్థ్యం కల్గిన 23 ఎల్ ఎంవోలు అదనంగా కొనుగోలు చేశామన్నారు. 183 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 20 పడకల పీడియాట్రిక్ కేర్ యూనిట్లను నెలకొల్పామని తెలిపారు.

గతంలో ఒక్క వైరల్ ల్యాబ్ కూడా లేని దుస్థితి రాష్ట్రంలో ఉండేదని.. టెస్టులు చేయాలంటే హైదరాబాద్, పూణెకు పంపాల్సి వచ్చేదని సీఎం జగన్ అన్నారు. దాన్ని అధిగమించేందుకు 20 ఆధునిక వైరల్ ల్యాబ్​లను ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. మరో 19 ల్యాబ్​లు త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. కేరళ తర్వాత విజయవాడలోనే జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటైందన్నారు. రూ.20 కోట్ల వ్యయంతో ఆక్సీజన్ క్రయోజనిక్ ఐఎస్​వో కంటైనర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో ఎక్కడా ఆక్సీజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ సొంతంగా ఆక్సీజన్ ఉత్పత్తి చేసే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 100 పడకలపైన 71 ప్రైవేటు ఆస్పత్రుల్లో సొంతంగా ఆక్సీజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు 30 శాతం సబ్సిడీ ఇచ్చామన్నారు. అన్ని ప్లాంట్ల ఏర్పాటు పూర్తైతే.. 247 ప్రాంతాల్లో సొంతంగా ఆక్సీజన్ తయారు చేసే అవకాశం త్వరలో ఏర్పడుతుందన్నారు.

18 ఏళ్ల పైబడిన వారికి 100 శాతం వాక్సినేషన్ పూర్తిగా చేశామని.., 18 ఏళ్లు పైన ఉన్న వారికి 80 శాతం మందికి రెండు డోసులు వేశామన్నారు. 15-18 ఏళ్ల పిల్లల్లో 82 శాతం మందికి వాక్సినేషన్ పూర్తి చేసి దేశంలో అగ్రగామిగా ఉన్నామన్నారు. మెడికల్ రంగంలో ఫిబ్రవరి నాటికల్లా 39 వేల పోస్టులు రిక్రూట్ చేస్తామన్న సీఎం.. ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత లేకుండా డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది నియామకం చేపడుతున్నట్లు వివరించారు. ఇప్పటికే 23 వేల పోస్టులకు రిక్రూట్​మెంట్ నియామకం పూర్తైందన్నారు. వైద్య ఆరోగ్య రంగాన్ని విప్లవాత్మకంగా మార్చేలా సమూలంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ప్రతీ పార్లమెంట్​ నియోజకవర్గంలో ఒకటి చొప్పున 16 వైద్య కళాశాలలు నిర్మిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే 4 ప్రారంభం కాగా.. మిగిలిన 12 వైద్య కళాశాలల పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. కొవిడ్ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతోందని.. ఆదాయం తగ్గినా ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నామన్నారు.

ఇదీ చదవండి:

తెలంగాణ కుటుంబ ఆత్మహత్య కేసు.. సెల్ఫీ వీడియో బహిర్గతం

CM Jagan On Health Department In AP: కొవిడ్ మేనేజ్​మెంట్​లో దేశానికి ఆదర్శంగా నిలబడేలా రాష్ట్ర హెల్త్ డిపార్టుమెంట్ పనిచేస్తోందని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చినా.. సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అందుకోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పలు ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన 144 ఆక్సిజన్ ప్లాంట్లను సీఎం జగన్ వర్చువల్​గా ప్రారంభించారు.

ఆక్సీజన్ కొరత వల్ల కొవిడ్ సెకండ్ వేవ్​లో ఏర్పడిన పరిస్థితులు తలెత్తకుండా.. ఆస్పత్రుల్లో మెరుగైన వసతులు ఏర్పాటు చేశామని సీఎం జగన్ స్పష్టం చేశారు. రూ.426 కోట్ల వ్యయంతో పలు ఆస్పత్రుల్లో ఆక్సీజన్ ప్లాంట్లు, కీలక పరికరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 24,419 ఆక్సీజన్ పడకలతో సహా.. మొత్తం 39 లిక్విడ్ మెడికల్ ఆక్సీజన్ ట్యాంకులు సిద్ధం చేశామన్నారు. 32 పీఎస్​ఏ ఆక్సీజన్ ప్లాంట్లను ఇప్పటికే జాతికి అంకితం చేశామన్న సీఎం... 144 ప్లాంట్లను రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 74 ఎల్​ఎంవో ట్యాంకులు కొనుగోలు చేసి అందుబాటులో ఉంచామన్నారు. 230 కిలో లీటర్ల సామర్థ్యం కల్గిన 23 ఎల్ ఎంవోలు అదనంగా కొనుగోలు చేశామన్నారు. 183 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 20 పడకల పీడియాట్రిక్ కేర్ యూనిట్లను నెలకొల్పామని తెలిపారు.

గతంలో ఒక్క వైరల్ ల్యాబ్ కూడా లేని దుస్థితి రాష్ట్రంలో ఉండేదని.. టెస్టులు చేయాలంటే హైదరాబాద్, పూణెకు పంపాల్సి వచ్చేదని సీఎం జగన్ అన్నారు. దాన్ని అధిగమించేందుకు 20 ఆధునిక వైరల్ ల్యాబ్​లను ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. మరో 19 ల్యాబ్​లు త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. కేరళ తర్వాత విజయవాడలోనే జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటైందన్నారు. రూ.20 కోట్ల వ్యయంతో ఆక్సీజన్ క్రయోజనిక్ ఐఎస్​వో కంటైనర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో ఎక్కడా ఆక్సీజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ సొంతంగా ఆక్సీజన్ ఉత్పత్తి చేసే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 100 పడకలపైన 71 ప్రైవేటు ఆస్పత్రుల్లో సొంతంగా ఆక్సీజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు 30 శాతం సబ్సిడీ ఇచ్చామన్నారు. అన్ని ప్లాంట్ల ఏర్పాటు పూర్తైతే.. 247 ప్రాంతాల్లో సొంతంగా ఆక్సీజన్ తయారు చేసే అవకాశం త్వరలో ఏర్పడుతుందన్నారు.

18 ఏళ్ల పైబడిన వారికి 100 శాతం వాక్సినేషన్ పూర్తిగా చేశామని.., 18 ఏళ్లు పైన ఉన్న వారికి 80 శాతం మందికి రెండు డోసులు వేశామన్నారు. 15-18 ఏళ్ల పిల్లల్లో 82 శాతం మందికి వాక్సినేషన్ పూర్తి చేసి దేశంలో అగ్రగామిగా ఉన్నామన్నారు. మెడికల్ రంగంలో ఫిబ్రవరి నాటికల్లా 39 వేల పోస్టులు రిక్రూట్ చేస్తామన్న సీఎం.. ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత లేకుండా డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది నియామకం చేపడుతున్నట్లు వివరించారు. ఇప్పటికే 23 వేల పోస్టులకు రిక్రూట్​మెంట్ నియామకం పూర్తైందన్నారు. వైద్య ఆరోగ్య రంగాన్ని విప్లవాత్మకంగా మార్చేలా సమూలంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ప్రతీ పార్లమెంట్​ నియోజకవర్గంలో ఒకటి చొప్పున 16 వైద్య కళాశాలలు నిర్మిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే 4 ప్రారంభం కాగా.. మిగిలిన 12 వైద్య కళాశాలల పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. కొవిడ్ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతోందని.. ఆదాయం తగ్గినా ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నామన్నారు.

ఇదీ చదవండి:

తెలంగాణ కుటుంబ ఆత్మహత్య కేసు.. సెల్ఫీ వీడియో బహిర్గతం

Last Updated : Jan 10, 2022, 4:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.